Crime : ఐదేళ్ల ప్రేమ.. ఎందుకు విషాదాంతం అయింది..?

ఐదేళ్ల పాటు సాగిన ప్రేమకథ యువతి మరణంతో విషాదాంతం అయింది.

Update: 2024-08-04 04:36 GMT

ఐదేళ్ల పాటు సాగిన ప్రేమకథ యువతి మరణంతో విషాదాంతం అయింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ గంగానగర్‌లోని ఎం బ్లాక్‌లో ప్రేమికుడితో లివ్‌ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న యువ‌తి.. తన బెడ్‌రూమ్‌లో ఉరి వేసుకుని కనిపించింది. ప్రేమికుడు పరారీలో ఉన్నాడు. ప్రేమోన్మాది యువ‌తిని హత్య చేసి మృతదేహానికి దుపట్టాతో ఉరివేసినట్లు మృతురాలి బంధువులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ప్రేమికుడిని స్టేష‌న్‌కు పిలవ‌గా.. అతడు కొంత సమయం తర్వాత పోలీస్ స్టేషన్‌కు వస్తానని చెప్పినా.. ఇంకా హాజ‌రుకాలేదు.

ముజఫర్‌నగర్‌లోని మన్సూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోని నవలా గ్రామానికి చెందిన ఫైజ‌ల్ మీరట్‌లోని లిసాడిగేట్‌లో స్క్రాప్ డీలర్‌గా పనిచేసేవాడు. ఐదేళ్ల క్రితం లిసాడిగేట్‌లోని లఖిపుర నివాసి ఇరామ్‌తో పరిచయం ఏర్పడింది. ఇరామ్ బ్యూటీ పార్లర్‌లో పనిచేసేది. మొద‌ట్లో కొద్దిరోజులు ఇద్దరూ త‌రుచుగా క‌లిసేవారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇద్దరూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండ‌టం ప్రారంభించారు.

ఒకటిన్నర సంవత్సరం క్రితం ఫైజ‌ల్, ఇరామ్ మీరట్‌కు తిరిగి వచ్చి గంగానగర్‌లోని ఎం బ్లాక్‌లో కైలాష్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు నివసిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇరామ్ కుటుంబం ఇంటికి రావ‌డం ప్రారంభించింది. శుక్రవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇరామ్ మృతిపై ఇంటి యజమాని కైలాష్ పోలీసులకు సమాచారం అందించాడు.

స్టేషన్ ఇన్‌ఛార్జ్ విష్ణు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యూపీ-112కు కాల్ చేయడంతో గంగానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరామ్ మృతదేహం వేలాడుతూ ఉంది. అర్థరాత్రి ఇరామ్ బంధువులు కూడా గంగానగర్ చేరుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని కిందకు దించారు.

రాత్రి 12 గంటల సమయంలో ఇరామ్, ఫైజ‌ల్ మధ్య ఫోన్ లో వాగ్వాదం జరిగింది. శుక్రవారం రాత్రి పది గంటల ప్రాంతంలో బ్యూటీపార్లర్‌ నుంచి ఇరామ్‌ గంగానగర్‌కు వచ్చినట్లు.. 12 గంటల వరకు ఫైసల్‌తో మొబైల్‌లో మాట్లాడిన‌ట్లు.. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇరామ్ ఫోన్ డిస్‌కనెక్ట్ చేసింద‌ని.. ఫైజ‌ల్ ఇరామ్‌కి 20కి పైగా కాల్స్ చేసినా.. ఆమె కాల్ రిసీవ్ చేసుకోలేదని.. దీంతో ఫైజ‌ల్ స్నేహితులను ఇంటికి పంపించాడని వివ‌రించారు.

ఫైజ‌ల్ స్నేహితులు ఇంటి యజమాని కైలాష్‌తో ఫైజ‌ల్‌ను క‌నెక్ట్‌ చేశారు. కైలాష్‌ని తీసుకుని వారు ఇంటి లోపలికి వెళ్లారు. బెడ్ రూమ్ తలుపు మూసి ఉంది. ఎంతసేపు కేకలు వేసినా తలుపులు తెరుచుకోకపోవడంతో ఫైజ‌ల్ స్నేహితులు డోర్‌ పగులగొట్టారు. లోపల ఇరామ్ ఉరి వేసుకుని ఉంది. ఘటన జరిగిన సమయంలో ఫైజ‌ల్ మీరట్‌లో ఉన్నాడు. అనంతరం ఢిల్లీకి పారిపోయాడు. అతడిని పిలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి విష్ణుకుమార్ తెలిపారు. కొంత వివాదం కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరామ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మృతికి గల కారణం తేలనుంది.

Tags:    

Similar News