Telangana : దానిమ్మ పండు తెంపాడ‌ని దళిత బాలుడిపై దాడి

హైదరాబాద్ శివార్లలో ఒక వ్యక్తి 14 ఏళ్ల దళిత బాలుడిని క‌ట్టేసి దాడి చేశాడు.

By :  Eha Tv
Update: 2024-06-26 07:49 GMT

హైదరాబాద్(Hyderabad) శివార్లలో ఒక వ్యక్తి 14 ఏళ్ల దళిత బాలుడిని క‌ట్టేసి దాడి చేశాడు. తన ఇంట్లో ఉన్న‌ దానిమ్మ చెట్టు నుంచి పండు తెంపుతున్నాడని ఆరోపిస్తూ ఆ వ్య‌క్తి బాలుడిని కట్టేసి కొట్టినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన జూన్ 22న షాబాద్ మండలం కేసారం గ్రామంలో జరగ‌గా ఆల‌స్యంగా ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన బాధితుడు చెట్టుకు ఉన్న‌ దానిమ్మ పండు కోసేందుకు ఇంటి కాంపౌండ్ వాల్‌ను ఎక్కినట్లు పోలీసులు తెలిపారు.

ఇంటి యజమాని రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అత‌డు బాలుడిని పట్టుకుని చేతులు, కాళ్ళు తాడుతో కట్టివేసి కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘ‌ట‌న‌కు సంబంధించి బాలుడు నేలపై పడుకున్న ఫోటో వైరల్‌గా మారింది. జూన్ 24న బాధితుడి తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా.. IPC సెక్షన్లు 342, 324, బాల‌ల చట్టంలోని సంబంధిత సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ కింద దాడి చేసిన‌ వ్యక్తి, అతని కుమారునిపై కేసు నమోదు చేశారు.

బాధితుడి తల్లి సంఘటనా స్థలానికి వెళ్లగా.. దాడి చేసిన‌ వ్యక్తి, అతని కుమారుడు ఆమెపై దుర్భాషలాడారని ఆరోపించింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతుండ‌గా.. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Tags:    

Similar News