హైదరాబాద్‌లో ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా "బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తాను" అని ప్రకటన చేశాడు.

హైదరాబాద్‌లో ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా "బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తాను" అని ప్రకటన చేశాడు. అతను పాతబస్తీలో తన స్నేహితుడి షాపుకు రమ్మని పిలిచి, ఒక్కొక్కరి నుండి 200 రూపాయలు వసూలు చేసి, వారి తలలు గుండు కొట్టి, ఏదో ద్రవం (లిక్విడ్) రాసి పంపించాడు. ఆ ద్రవం ఆరిపోకుండా తలను తడుపుతూ ఉండాలని సూచించాడు. కానీ, కొన్ని గంటల్లోనే తలపై మంట, బొబ్బలు వచ్చాయి, దీంతో బాధితులు ఆసుపత్రికి పరుగెత్తారు. వకీల్ డబ్బు సంచులు నింపుకుని పరారయ్యాడు. ఇలాంటి మోసాలు గతంలోనూ జరిగాయి. ఉదాహరణకు, గతంలో "న్యూజన్ హెరాయిల్" అనే ఉత్పత్తిని ప్రచారం చేసిన వ్యక్తి, "చేతులతో రాస్తే చేతులపై కూడా వెంట్రుకలు వస్తాయి" అని నమ్మించి, అనేక మంది నుండి డబ్బు వసూలు చేసి కోట్లు సంపాదించాడు. ఇవన్నీ జుట్టు రాలే సమస్యతో బాధపడే వారి మానసిక బలహీనతను లక్ష్యంగా చేసుకున్న మోసాలే. లేని జుట్టుకోసం ఆశపడితే ఉన్నది ఊడిపోయిందంటూ బాధితులు వాపోయారు

Updated On 7 April 2025 1:40 PM GMT
ehatv

ehatv

Next Story