CM Revanth vs KTR : అధికారం పోయినా బలుపు తగ్గలేదు.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ కౌంట‌ర్‌

బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. స‌చివాల‌యంలో రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని తొలిగిస్తామ‌న్న‌ కేటీఆర్ వ్యాఖ్య‌ల‌కు కౌంటర్ ఇచ్చారు

Update: 2024-08-20 06:55 GMT

బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. స‌చివాల‌యంలో రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని తొలిగిస్తామ‌న్న‌ కేటీఆర్ వ్యాఖ్య‌ల‌కు కౌంటర్ ఇచ్చారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు.. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదన్నారు.

అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు.. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద‌ చేయి వేయండి అంటూ స‌వాల్ విసిరారు. నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు.. బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చింతమడకకే పరిమితం అని ఫైర్ అయ్యారు.

పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదన్నారు. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుందన్నారు. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు.

Tags:    

Similar News