Hyderabad : నేరేడ్‌మెట్‌లో దారుణం.. గంజాయి మత్తులో బాలిక‌పై సామూహిక అత్యాచారం

నేరేడ్‌మెట్‌లో 13 ఏళ్ల బాలికకు ఆమె ‘ప్రియుడు’తో పాటు మరో నలుగురు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

By :  Eha Tv
Update: 2024-06-25 14:32 GMT

నేరేడ్‌మెట్‌లో 13 ఏళ్ల బాలికకు ఆమె ‘ప్రియుడు’తో పాటు మరో నలుగురు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలికి నేరేడ్‌మెట్‌కు చెందిన ఓ వ్య‌క్తితో ప‌రిచయం ఉంది. అతడితో కలిసి బైక్‌పై బయటకు వెళ్లేది. ఇటీవల ఒంటరి ప్రదేశంలో బాలిక‌కు గంజాయి తాగించి అత‌డు ఆమెపై అత్యాచారం చేశాడు. తరువాత ఆ వ్య‌క్తి బాధితురాలిని తన స్నేహితులకు పరిచయం చేశాడు, వారందరూ గంజాయి మత్తులో.. ఆమెపై అత్యాచారం చేశార‌ని వెల్ల‌డించారు.

ఇంటికి తిరిగి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాధితురాలి త‌ల్లి కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం బాధితురాలి తల్లి ఐదుగురిపై ఫిర్యాదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Tags:    

Similar News