Vijay Sai Reddy : వంశీకి తల్లికి చెల్లికి తేడా తెలియదు.. విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం!

తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారెవరినీ వదిలిపెట్టనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy) హెచ్చరించారు. అయిదేళ్ల తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇ

By :  Eha Tv
Update: 2024-07-15 09:20 GMT

తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారెవరినీ వదిలిపెట్టనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy) హెచ్చరించారు. అయిదేళ్ల తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇప్పుడు తోకలు ఆడిస్తున్న వారి తోకలను కత్తిరిస్తామని చెప్పారు. తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనని, ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని, ఆమెతో నాకు సంబంధం అంటగట్టారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారని, అసత్య కథనాలు ప్రసారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తానని గట్టిగా చెప్పారు. చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగానని, బ్లాక్‌​ మెయిల్‌ చేసి డబ్బు వసూల్‌ చేసే వ్యక్తిని కాదని అన్నారు. రాధాకృష్ణ(Radha Krishna), బీఆర్‌నాయుడు(BR Naidu), వంశీకృష్ణ(Vamshi Krishna) లాంటి వ్యక్తిని కాదని, అన్ని హక్కుల కమిషన్‌లకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మహాన్యూస్‌(Maha News) వంశీకృష్ణను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోనని, పార్లమెంట్‌లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెడతానని, ప్రివిలేజ్‌ మోషన్‌ మూవ్‌ చేస్తానని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై వరుస క్రమంలో బురద జల్లుతున్నారని, తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. విశాఖపట్నం(Visakhapatnam)లో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయి రెడ్డి ప్రత్యర్థులపై తీవ్రంగా మండిపడ్డారు. ' నా ఇంటికి టీడీపీ నాయకుడు, ఒక మహిళ వచ్చారు. ఇది సిసీ కెమెరాల్లో రికార్డు అయింది. విజయసాయి రెడ్డి గాడు పారిపోయాడా ఉన్నాడా అని అడిగాడు. వాడు టైం చెపితే నేనే వస్తాను, నేనే వాడి ఇంటికి వెళ్తాను. మేము ఎవడికి భయపడేది లేదు. మళ్ళీ వచ్చేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమే. మధ్యంతర ఎన్నికలు వచ్చినా వైఎస్‌ఆర్‌సీపీనే గెలుస్తుంది. తాటాకు చపపుళ్లకు నేను భయపడేది లేదు. ఒక ఆదివాసీ మహిళకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. నిరాధార ఆరోపణలు చేశారు. మహా న్యూస్, ఏబీఎన్‌, టీవీ 5 నాపై తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. ఆ మీడియా సంస్థలు కనీసం నా వివరణ కూడా తీసుకోలేదు. మీతో ఎలా క్షమాపణ చెప్పించాలో నాకు తెలుసు. నా వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసు. రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, వంశీ కృష్ణ లాగా బ్లాక్ మెయిల్ చేయడం నాకు తెలియదు. నేను తప్పు చేస్తే దేవ దేవుడు శిక్షిస్తాడు. బరితెగించి హద్దులు మీరు ఆధారాలు లేకుండా ఆదివాసీ మహిళతో సంబంధం కట్టబెట్టారు. ఈ కుట్ర వెనుక ఉన్న వంశీ, రాధా కృష్ణ, వెంకట కృష్ణ, బిఆర్ నాయుడు, సాంబలకు బుద్ధి చెపుతాను. రామోజీరావును ధైర్యంగా ఎదుర్కొన్నాను. వంశీ అనే వాడిపై, పరువు నష్టం దావాతో పాటు పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాను. ఎస్టీ కమిషన్, ఉమెన్ ఆర్గనైజేషన్ ను ఫిర్యాదు చేస్తాను. ప్రైవేట్ మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడతాను. సహాయం కోసం వస్తే సంబంధం అంటకట్టేస్తారా? వయసుతో సంబంధం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తారా? విజయసాయిరెడ్డి తండ్రి లాంటి వారని ఆదివాసీ మహిళ చెప్పింది. వంశీ అమ్మ అబ్బకు పుట్టి ఉంటే ఇటువంటివి రాసే వాడు కాదు. కుట్రలో భాగంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఛానెల్స్ నాపై తప్పుడు ప్రచారం చేశాయి. వంశీ మీ అమ్మ అక్క చెల్లి ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే ఇలానే డిబెట్లు పెడతావా? వంశీ, సాంబ, వెంకట కృష్ణ పుట్టుక మీద నాకు అనుమానం ఉంది. మీకు డీఎన్ఏ టెస్ట్ లు చేయాలి. బ్లీచింగ్ పౌడర్, టాల్కం పౌడర్‌కు తేడా తెలియని వ్యక్తి వంశీ. ఓనమాలు రాని వ్యక్తి వంశీ. తల్లికి చెల్లికి తేడా తెలియని వ్యక్తి వంశీ. వంశీ ఇంట్లో ఆడవాళ్ళు మీద ఆరోపణలు చేస్తే ఆ బాధ తెలిసేది. టీవీ 5 సాంబ గురించి సంద్య శ్రీధర్ గురించి అడగాలి. వెంకట కృష్ణ అమ్మాయిని మోసం చేసి ఈనాడులో ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి, ఎవరో మహిళతో మహాన్యూస్‌ వంశీకి అక్రమ సంబంధం ఆటగట్టి డీఎన్ఏ టెస్ట్ అడిగితే ఎలా ఉంటుంది? ' అని విజయసాయిరెడ్డి తీవ్ర స్వరంతో చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News