YS Jagan: ఈవీఎంలపై సంచలన ట్వీట్ చేసిన వైఎస్ జగన్

By :  Eha Tv
Update: 2024-06-18 04:18 GMT

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈవీఎంల గురించి చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంల గురించి సంచలన ట్వీట్ చేశారు. ‘‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తమ్మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్‌ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి’’ అని చెప్పుకొచ్చారు.

2024 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈవీఎంల ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌లపై చర్చ సాగుతూ ఉంది. కాంగ్రెస్ నేతలు, ఇండియా కూటమి నేతలు కూడా ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తూ ఉన్నారు.



Tags:    

Similar News