Andhra Pradesh : జ‌ల‌పాతానికి వెళ్లి ఆస్ట్రేలియాలో ఇద్దరు ఏపీ విద్యార్థులు గల్లంతు

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని కెయిర్న్స్ సమీపంలోని మిల్లా మిల్లా జలపాతంలో ఈత కొడుతూ ఇద్దరు భారతీయ విద్యార్థులు మునిగిపోయారు

By :  Eha Tv
Update: 2024-07-18 04:49 GMT

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని కెయిర్న్స్ సమీపంలోని మిల్లా మిల్లా జలపాతంలో ఈత కొడుతూ ఇద్దరు భారతీయ విద్యార్థులు మునిగిపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులను బాపట్ల జిల్లాకు చెందిన చైతన్య ముప్పరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన సూర్యతేజ బొబ్బాగా గుర్తించారు. ఇరువురు ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లారు.

క్వీన్స్‌లాండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలపాతంలో ఈత కొడుతుండగా.. ఓ విద్యార్థి నీటిలో చిక్కుకున్నాడు. అతనికి సహాయం చేయడానికి మ‌రో విద్యార్ధి వెళ్ళాడు.. కానీ అతడు కూడా అక్క‌డే చిక్కుకుపోయాడు. వారి ఆచూకీ కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు చేసినా ఆచూకీ దొరకలేదు. అధికారులు హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో మరో విద్యార్థి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే..అతడి గురించి వివ‌రాలు వెల్లడించలేదు.

Tags:    

Similar News