Speaker Ayyannapatrudu : నాపై చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు విశాఖ ప‌ర్య‌ట‌కు వెళ్లారు. స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయ‌న‌ విశాఖకు వచ్చారు.

By :  Eha Tv
Update: 2024-06-29 10:13 GMT

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు విశాఖ ప‌ర్య‌ట‌కు వెళ్లారు. స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయ‌న‌ విశాఖకు వచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఎయిర్ పోర్టులో టీడీపీ శ్రేణులు, అభిమానులు, అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం స్పీకర్ హోదాలో విశాఖ‌కు వచ్చాన‌ని తెలిపారు. ఎలా అంటే అలా మాట్లాడడం ఇప్పుడు సాధ్యం కాదని.. నాకు కొన్ని పరిమితులు ఉంటాయని అన్నారు.

ఉత్తరాంధ్రకి మళ్ళీ స్పీకర్ పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. చిన్న వయసులో ఎన్టీఆర్ నాకు మంత్రి పదవి ఇస్తే.. ఈ వయసులో చంద్రబాబు అత్యున్నత స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు. నాపై చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్ప‌ష్టం చేశారు. 

Tags:    

Similar News