Pawan Kalyan : నేటి నుంచి పిఠాపురంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌

పిఠాపురంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు.

By :  Eha Tv
Update: 2024-07-01 03:57 GMT

పిఠాపురంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జూలై 1న సామాజిక ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. గొల్లప్రోలు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం మధ్యాహ్నం చేబ్రోలులో పిఠాపురం జనసేన నేతలతో భేటీ కానున్నారు.

జూలై 2న కాకినాడ కలెక్టరేట్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకూ పంచాయితీ, అటవీ కీలక శాఖల రివ్యూ మీటింగ్ ఉంటుంది. అనంత‌రం మధ్యాహ్నం జనసేన ఎమ్మెల్యే, ఎంపీలతో భేటీ ఉంటుంది.

జూలై 3న ఉప్పాడ, యు.కొత్తపల్లిలో ఫీల్డ్ విజిట్ ఉంటుంది. మధ్యాహ్నం టీడీపీ, బీజేపీ కీలక నేతలతో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో వారాహీ భహిరంగ సభ ఉంటుంది. తర్వాత హెలికాఫ్టర్‌లో విజయవాడ తిరుగు ప్రయాణం అవుతారు. 

Tags:    

Similar News