Chandrababu : రేపు శ్రీసిటీ ప‌ర్య‌ట‌న‌కు చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తిరుపతి జిల్లా శ్రీసిటీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను అధికారులు విడుద‌ల చేశారు

Update: 2024-08-18 13:24 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తిరుపతి జిల్లా శ్రీసిటీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను అధికారులు విడుద‌ల చేశారు. ఉండవల్లిలో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి నివాసం నుండి బయలుదేరి 11.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా శ్రీసిటీకి వెళ్తారు. శ్రీసిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. సీఎం 15 సంస్థల కార్యకలాపాలను శ్రీసిటీలో ప్రారంభించనున్నారు. మరో 7 సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు.

రూ.900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2,740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. మరో రూ.1,213కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. శ్రీసిటీలో పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలో సోమశిల సాగునీటి ప్రాజెక్టును సందర్శించనున్నారు. తిరిగి సాయంత్రం ముఖ్యమంత్రి ఉండవల్లి చేరుకుంటారు.

Tags:    

Similar News