Nara Lokesh : కర్నాటక ఉద్యోగ రిజర్వేషన్ బిల్లుపై NASSCOM అసంతృప్తి.. ఏపీకి రావాల‌ని లోకేష్‌ ఆహ్వానం

ప్రైవేట్ పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలను రిజర్వ్ చేయడానికి కర్ణాటక క్యాబినెట్ ఆమోదించిన బిల్లుపై NASSCOM నిరాశ వ్యక్తం చేసింది

By :  Eha Tv
Update: 2024-07-18 04:37 GMT

ప్రైవేట్ పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలను రిజర్వ్ చేయడానికి కర్ణాటక క్యాబినెట్ ఆమోదించిన బిల్లుపై NASSCOM నిరాశ వ్యక్తం చేసింది. ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారులను ఏపీకి తమ వ్యాపారాలను మార్చమని ఆహ్వానించారు.

పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర వాణిజ్య సంస్థల్లో స్థానిక అభ్యర్థులకు 50 శాతం మేనేజిరియల్ పొజిష‌న్స్‌, 75 శాతం నాన్-మేనేజిరియల్ పొజిష‌న్స్‌ కేటాయించే ముసాయిదా చట్టానికి కర్ణాటక కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. అయితే, తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం బిల్లును పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించింది.

కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ బిల్లు-2024 ఆమోదంపై ఐటి రంగ అపెక్స్ బాడీ, నాస్కామ్ నిరాశ, ఆందోళన వ్యక్తం చేసిన నేప‌థ్యంలో.. నారా లోకేష్ ట్విట‌ర్ ద్వారా పెట్టుబడిదారులను ఆహ్వానించారు. స్థానికంగా నైపుణ్యం కలిగిన ప్రతిభ కొరతగా మారినందున ప్ర‌స్తుత‌ ఆంక్షలు.. కంపెనీలను తరలించడానికి బలవంతం చేయవచ్చని NASSCOM పేర్కొంది.

దీంతో లోకేష్ “మీ నిరాశను మేము అర్థం చేసుకున్నాము. వైజాగ్‌లోని మా IT సేవలు, AI, డేటా సెంటర్ క్లస్టర్‌కు మీ వ్యాపారాలను విస్తరించడం లేదా మార్చడానికి మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము అని పోస్ట్ చేసారు.


“మేము మీకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం నుండి ఎటువంటి పరిమితులు లేకుండా మీ IT సంస్థకు అత్యంత అనుకూలమైన నైపుణ్యం కలిగిన ప్రతిభను అందిస్తాము. మీకు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది. దయచేసి సంప్రదించండి,” అన్నారాయన.

Tags:    

Similar News