CM Revanth : ఆగస్టు 3 నుంచి సీఎం రేవంత్ అమెరికా పర్యటన.. వారం పాటు అక్క‌డే..

తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 3 నుంచి 11వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు

By :  Eha Tv
Update: 2024-07-21 03:34 GMT

తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 3 నుంచి 11వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు కూడా అమెరికా వెళ్ల‌నున్నారు. ఈ పర్యటనలో తెలంగాణ‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు బహుళజాతి కంపెనీల సీఈవోలతో చర్చలు జరపాలని రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

జనవరిలో దావోస్ ప‌ర్య‌ట‌న విజయవంతమైన నేప‌థ్యంలో.. ఈ ప‌ర్య‌ట‌నపై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. దావోస్ ప‌ర్య‌ట‌నలో రూ. 40,000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. ఆ ప‌ర్య‌ట‌న‌లో అనేక బహుళజాతి సంస్థలు తెలంగాణలో కార్యకలాపాలను స్థాపించడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి.

Tags:    

Similar News