Crime : చిన్నారిపై అత్యాచారం, హ‌త్య‌.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

బాలికపై అత్యాచారం కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష వేస్తూ బుధవారం తీర్పు వెలువ‌రించింది.

By :  Eha Tv
Update: 2024-08-01 02:56 GMT

బాలికపై అత్యాచారం కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష వేస్తూ బుధవారం తీర్పు వెలువ‌రించింది. వివ‌రాళ్లోకెళితే.. 2018లో నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై దినేష్ అనే తాపీ కూలీ అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడికి రంగారెడ్డి కోర్టు 2021లోనే ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. బుధ‌వారం ఆ పిటిషన్‌పై విచారణ జరగ‌గా.. రాష్ట్ర హైకోర్టు రంగారెడ్డి కోర్టు తీర్పును సమర్థించింది.

Tags:    

Similar News