MLA Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కొత్త చ‌ట్టం కింద‌ కేసు

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు న‌మోదైంది.

By :  Eha Tv
Update: 2024-07-03 03:54 GMT

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు న‌మోదైంది. త‌ద్వారా బీఎన్ఎస్ యాక్ట్‌లో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యేగా చెడు రికార్డును త‌న పేరిట లిఖించుకున్నారు. నిన్న జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సీఈవో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలొ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని.. వెళ్ల‌కుండా అడ్డుగా బైఠాయించారు. ఈ విష‌య‌మై జడ్పీ సీఈవో ఫిర్యాదు చేయ‌గా.. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం.. సెక్షన్ 221,126(2)ల‌ కింద‌ కేసు నమోదు అయ్యింది. బీఎన్ఎస్ చట్టం అమలులొకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డిపై నమోదు కావ‌డం విశేషం.  

Tags:    

Similar News