Hardik Pandya : ఆ విజ‌యం తర్వాత తొలిసారి స్వ‌గ్రామానికి వెళ్లిన హార్దిక్.. ఘ‌న స్వాగ‌తం ప‌లికిన అభిమానులు

T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత భారత జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సోమవారం తన స్వస్థలమైన వడోదర చేరుకున్నాడు

By :  Eha Tv
Update: 2024-07-16 03:06 GMT

T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత భారత జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సోమవారం తన స్వస్థలమైన వడోదర చేరుకున్నాడు. ముంబయి మాదిరిగానే వడోదరలో కూడా విజయోత్సవ పరేడ్‌ను నిర్వహించారు. ఓపెన్ బస్సులో వెళుతున్న పాండ్యా అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించాడు.

బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. అంతకుముందు 2013లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంది. 2011లో వన్డే ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంది.

భారత్ విజయం తర్వాత టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిన్న‌ తన స్వగ్రామానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైన‌ల్‌లో చివరి ఓవర్ హార్దిక్ బౌలింగ్‌ చేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే డేవిడ్ మిల్లర్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags:    

Similar News