Maharashtra Election : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగేది అప్పుడే.. హింట్ ఇచ్చిన‌ సీఈసీ

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు వ్యూహాలు రచించాయి.

Update: 2024-09-28 11:48 GMT

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు వ్యూహాలు రచించాయి. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ఎన్నికల సన్నాహాలను ఎన్నికల సంఘం సమీక్షించింది. ఎన్నికలకు సంబంధించి పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల ప్ర‌తినిధులు, అధికారులతో కలిశామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు. ద‌స‌రా, దీపావళి వంటి పండుగలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించాలని పార్టీలు కోరాయని చెప్పారు. ప్రజాస్వామ్య పండుగకు మహారాష్ట్ర దోహదపడుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉందని సీఈసీ అన్నారు.

ఎన్నికల సన్నాహాల సమీక్షా సమావేశంలో.. రాజీవ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల 2024 సమయంలో ఎన్నికల నేరాలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ల స్థితి గురించి మహారాష్ట్ర జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లను అడిగారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సీఈసీ కఠినంగా చెప్పింది. ఈ కేసులను ముగింపుకు తీసుకెళ్లడంలో ఎలాంటి అలసత్వం లేకుండా దర్యాప్తును వేగవంతం చేయాలని రాష్ట్ర పోలీసు నోడల్ అధికారులను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ సమీక్షా సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు, ఓటరు క్యూలను సక్రమంగా నిర్వహించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాలను స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలని.. క్యూలో నిల్చున్న ఓటర్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలని డీఈవోలను సీఈసీ ఆదేశించారు.

Tags:    

Similar News