Delhi Excise Policy Case : కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చేనా.? ఢిల్లీ హైకోర్టులో విచారణ ప్రారంభం

ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతికి సంబంధించిన సీబీఐ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో ఈరోజు విచారణ జరుగుతోంది

By :  Eha Tv
Update: 2024-07-17 08:45 GMT

ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతికి సంబంధించిన సీబీఐ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో ఈరోజు విచారణ జరుగుతోంది. ఈడీ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది వాద‌న‌లు వినిపిస్తూ.. ఆయన ముఖ్యమంత్రి.. ఉగ్రవాది కాదని అన్నారు. గత కొన్ని నెలలుగా జైలులో ఉన్న ఆయనను సీబీఐ అరెస్టు చేయలేదు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన వెంటనే సీబీఐ ఆయ‌న‌ను అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది.. కేజ్రీవాల్ కేసులో లొంగిపోయారని.. ఆ తర్వాత ట్రయల్ కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు నిర్ణయం ఖచ్చితంగా సరైనది. కేజ్రీవాల్ ఎక్కడికీ పారిపోలేదని.. తప్పుడు కేసులో అరెస్ట్ అయ్యారన్నారు. విచారణకు కేజ్రీవాల్ ఎప్పుడూ సహకరిస్తున్నారని వాదించారు. వాద‌న‌లు విన్న కోర్టు.. తీర్పు ఇవ్వాల్సివుంది. 

Tags:    

Similar News