RG Kar Hospital Case : 'ఆ రాత్రి ప్రియురాలితో క‌లిసి..' ట్రైనీ డాక్టర్‌ కేసులో టీఎంసీ యువనేతను విచారించిన‌ సీబీఐ

RG కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం కేసులో తాజాగా తృణమూల్ కాంగ్రెస్ యువనేత ఆశిష్ పాండేని సీబీఐ విచారించింది

Update: 2024-09-20 04:00 GMT

RG కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం కేసులో తాజాగా తృణమూల్ కాంగ్రెస్ యువనేత ఆశిష్ పాండేని సీబీఐ విచారించింది. అత‌డు RG కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో హౌస్ స్టాఫ్ కూడా. ఆశిష్ పాండేని కొన్ని గంటల పాటు సీబీఐ విచారించింది. "చాలా మంది వ్యక్తుల కాల్ లిస్ట్‌లలో పాండే ఫోన్ నంబర్ ఉంది. ట్రైనీ డాక్టర్ మృతదేహం దొరికిన రోజు.. పాండే తన ప్రియురాలితో సాల్ట్ లేక్‌లోని ఒక హోటల్‌లో ఉన్నాడు. ఆ రోజు అతని కార్యకలాపాలను మేము ట్రాక్ చేస్తున్నామని సిబిఐ అధికారి తెలిపారు.

పాండే బుకింగ్, చెల్లింపు వివరాలను అందించాల‌ని కోరుతూ హోటల్ సిబ్బందికి సీబీఐ సమన్లు ​​ఇచ్చింది. "హోటల్ గదిని ఒక యాప్ ద్వారా బుక్ చేశాడు. అతడు ఆగస్ట్ 9 మధ్యాహ్నం హోటల్‌కి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం బయలుదేరాడు. అతడు అక్కడ బస చేసిన ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం" అని అధికారి తెలిపారు.

Tags:    

Similar News