Earthquake : బీహార్-జార్ఖండ్‌లో భూకంపం.. ఇళ్లు, దేవాల‌యాల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు

బీహార్‌లో భూకంపం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లు, దేవాల‌యాల‌ నుంచి బయటకు ప‌రుగులు తీశారు

Update: 2024-08-27 03:47 GMT

బీహార్‌లో భూకంపం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లు, దేవాల‌యాల‌ నుంచి బయటకు ప‌రుగులు తీశారు. భూకంప కేంద్రం జార్ఖండ్‌లో కేంద్రీకృత‌మై ఉంది. భూకంప ప్రభావం పొరుగు రాష్ట్రాలలో కూడా కనిపించింది. అయితే భూకంపం వ‌ల్ల‌ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. రాత్రి 12:50 గంటల స‌మ‌యంలో భూమి కంపించింది.

బీహార్‌లోని భాగల్పూర్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతాల్ పరగణాకు రామ్‌ఘర్ భూకంప కేంద్రం. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. జన్మాష్టమి సంద‌ర్భంగా సోమవారం రాత్రి చాలా మంది మేల్కొని ఉండగా.. భూకంపం వచ్చిన స‌మ‌యంలో ఎక్కువ‌గా దేవాలయాలలో ఉన్నారు. దీంతో భ‌క్తులు దేవాల‌యాల‌ నుంచి బయటకు ప‌రుగులు తీశారు. భూకంపంపై సమాచారాన్ని భ‌క్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భూకంపం ప్రభావం జార్ఖండ్ లో కూడా కనిపించింది. జార్ఖండ్‌ లోని దియోఘర్, గొడ్డా, రాంపూర్ పరిసర జిల్లాల్లో భూమి కంపించింది. అయితే, ఎలాంటి నష్టం జరగలేదు.

అంత‌కుముందు సీమాంచల్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి డెహ్రాడూన్‌లో తీవ్రత 3.1తో భూమి కంపించింది. అలాగే మంగళవారం జమ్మూకశ్మీర్‌లో రెండుసార్లు భూకంపం సంభవించింది. వాటి తీవ్రత 4.8, 4.9గా నమోదైంది.

Tags:    

Similar News