Hyderabad : మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యా ర్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి

By :  Eha Tv
Update: 2024-07-20 02:39 GMT

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యా ర్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ కారు మితి మీరిన వేగంతో వచ్చి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు స్కోడా కారులో వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈప్రమాదంలో అక్ష‌య్‌, హ‌రి, అస్మిత్ అనే ముగ్గురు విద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. పోలీసులు ఘటనాస్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News