మరిదితో వివాహేతర సంబంధం.. ఇంట్లో విషయం తెలియడంతో..

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మన దేశంలో కూడా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి.

By :  Eha Tv
Update: 2024-06-25 10:01 GMT

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మన దేశంలో కూడా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. విలువలు, వావివరుసలు మరిచిపోయి తాత్కాలిక సుఖాలకు అలవాటు పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. పరువు ప్రతిష్టల గురించి ఆలోచించకుండా ఎంతకైనా తెగిస్తున్నారు. పరాయి స్త్రీ లేదా పురుషుడి మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ వరుసకు మరిది అయిన వ్యకితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంతకాలంగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతోంది. అయితే వీరి వివాహేతర సంబంధం గురించి ఇంట్లో తెలిసిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా చేసింది. వీళ్ల వివాహేతర సంబంధం ఇంట్లో తెలియడంతో భయపడిపోయిన ఈ జంట బలవన్మరణానికి పాల్పడింది. గుత్తి మండలం బేతాపల్లికి చెందిన నిజామా(35) వరుసకు మరిది అయిన తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన మహబూబ్‌బాషా(26)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా వీరి వివాహేతర కొనసాగింది. అయితే రెండు రోజుల కిందట ఇంటి నుంచి ఇద్దరూ బయటికి వచ్చేశారు. దీంతో ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పరువు పోతుందని భావించి కుటుంబ సభ్యులకు మొహాలు చూపించుకోలేక పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు

Tags:    

Similar News