YS Sharmila : డీకే శివకుమార్‌ను క‌లిసిన షర్మిల

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బుధ‌వారం ఉదయం ఆయన నివాసంలో కలిశారు.

By :  Eha Tv
Update: 2024-07-03 05:54 GMT

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బుధ‌వారం ఉదయం ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75 జయంతి వేడుకలకు హజరవ్వాలని ఆమె శివ కుమార్‌ను కోరారు. భేటీలో భాగంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.

మంగ‌ళ‌వారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క‌తో కూడా సమావేశం అయ్యారు. హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రగతి భవన్ నివాసంలో ఆమె భట్టి విక్రమార్కను క‌లిశారు. ఆయ‌న‌ను కూడా వేడుక‌ల‌కు ఆహ్వానించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ను కూడా క‌లిసి వైఎస్ఆర్ జ‌యంతి వేడుక‌ల‌కు హాజ‌ర‌వాల‌ని కోరారు. 

Tags:    

Similar News