Minister Parthasarathy : మానవత్వం చాటుకున్న మంత్రి పార్థసారథి

మంత్రి పార్థసారథి మానవత్వం చాటుకున్నారు. చాట్రాయి మండలంలో పర్యటన నిమిత్తం శుక్రవారం నూజివీడు లో మంత్రి కార్యాలయంనకు వస్తున్న రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం తుక్కులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చూసి వెంటనే స్పందించారు

Update: 2024-09-27 14:01 GMT

మంత్రి పార్థసారథి మానవత్వం చాటుకున్నారు. చాట్రాయి మండలంలో పర్యటన నిమిత్తం శుక్రవారం నూజివీడు లో మంత్రి కార్యాలయంనకు వస్తున్న రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం తుక్కులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చూసి వెంటనే స్పందించారు. తాను స్వయంగా తన వాహనం దిగి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెర్సీపూడి కి చెందిన కె. సాల్వే అనే మహిళను హుటాహుటిన ప్రత్యేక వాహనంలో నూజివీడు ఏరియా ఆసుపత్రి పంపించారు. అనంతరం నూజివీడు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేంద్ర సింగ్ కు ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను ఏరియా ఆసుపత్రికి పంపిస్తున్నామని, సదరు మహిళ ప్రాణాపాయం నుండి కాపాడి మెరుగైన వైద్య సేవలందించాలని, మహిళ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకి తెలియజేయాలని మంత్రి డా. నరేంద్ర సింగ్ కు చెప్పారు.  

Tags:    

Similar News