AP Govt : గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 31నే పెన్షన్ల పంపిణీ

ప్రతి నెలా 1వ తేదీన “ పేదల సేవలో” కార్యక్రమం క్రింద పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

Update: 2024-08-29 01:29 GMT

ప్రతి నెలా 1వ తేదీన “ పేదల సేవలో” కార్యక్రమం క్రింద పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం.. ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెన్షన్‌దారులు గ్రామాల్లో లేకపోవడం వల్ల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31వ తేదీన అందకపోతే సెప్టెంబర్ 2వ తేదీన (సోమవారం) అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Tags:    

Similar News