ఓ హీరోయిన్‌కు(Heroine) సంబంధించిన వ్యవహారంపై ఏపీలో హాట్‌హాట్‌గా రాజకీయం నడుస్తోంది.

ఓ హీరోయిన్‌కు(Heroine) సంబంధించిన వ్యవహారంపై ఏపీలో హాట్‌హాట్‌గా రాజకీయం నడుస్తోంది. ముంబైకి సంబంధించిన ఓ సినీనటితో ఓ పారిశ్రామిక వేత్తతో సన్నిహత సంబంధం ఏర్పడింది. అదికాస్త వివాదంగా మారింది. వివాదం కాస్త పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. ముంబైలోని(Mumbai) ఓ పోలీస్‌స్టేషన్‌లో ఆ పారిశ్రామికవేత్తపై ఫిర్యాదు చేసింది. అతనిపై రేప్‌ కేసు(Rapecase) పెట్టినట్లుగా సమాచారం. పారిశ్రామికవేత్తకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా పోలీసులకు సమర్పించినట్లు సమాచారం. దీంతో సదరు పారిశ్రామికవేత్త వైసీపీ నేతలను(YCP Leaders) అప్రోచ్‌ అయ్యారట. విజయవాడకు సంబంధించిన మరో పారిశ్రామికవేత్త ద్వారా ఆమెను విజయవాడకు తీసుకొచ్చి, ఆమె తనను చీట్‌ చేసిందని విజయవాడ పారిశ్రామికవేత్తతో కేసు పెట్టించి, ఆమెను ఇక్కడ 10-15 రోజుల పాటు బంధించి ముంబై పారిశ్రామికవేత్తపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకునేలా ఒత్తిడి చేసి, ఆమెను బెదిరించి, మరోసారి ఇలాంటి కేసులు మరోసారి పెడితే చంపేస్తామని చెప్పి పంపిచారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై అప్పటి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతలపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు. ప్రముఖ జర్నలిస్ట్‌ వైఎన్‌ఆర్‌ విశ్లేషణ ఈ కింది వీడియోలో..



Updated On 30 Aug 2024 12:30 PM GMT
Eha Tv

Eha Tv

Next Story