రెండేళ్లకోసారి మేడారం మహాజాతర నిర్వహిస్తుంటారు. తర్వాత ఏడాదికి నిర్వహించే మండమెలిగే పండగనే చిన్నజాతరగా పిలుస్తారు. దీన్ని ఈ సారి ఆదివాసీ సంప్రదాయాలతో నేటి (బుధవారం) నుంచి శనివారం (4వ తేదీ) వరకు మేడారంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం సమ్మక్క, సారలమ్మ ఆలయాలతో పాటు గద్దె ప్రాంగణాలను అలంకరించి సిద్ధం చేశారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.2.82 కోట్లతో తాగునీరు, మరుగుదొడ్లు, జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునే గదులు, విడిది గృహాలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, పోలీసు బందోబస్తు, […]

రెండేళ్లకోసారి మేడారం మహాజాతర నిర్వహిస్తుంటారు. తర్వాత ఏడాదికి నిర్వహించే మండమెలిగే పండగనే చిన్నజాతరగా పిలుస్తారు. దీన్ని ఈ సారి ఆదివాసీ సంప్రదాయాలతో నేటి (బుధవారం) నుంచి శనివారం (4వ తేదీ) వరకు మేడారంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం సమ్మక్క, సారలమ్మ ఆలయాలతో పాటు గద్దె ప్రాంగణాలను అలంకరించి సిద్ధం చేశారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.2.82 కోట్లతో తాగునీరు, మరుగుదొడ్లు, జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునే గదులు, విడిది గృహాలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, పోలీసు బందోబస్తు, తదితర పనులు పూర్తిచేశారు. హనుమకొండ బస్టాండు నుంచి ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సును నడపనున్నారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 8 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని, రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారానికి తరలిరానున్నారు.

Updated On 9 Feb 2023 3:02 AM GMT
Ehatv

Ehatv

Next Story