విజయవాడ అనగానే మనకు ఇంద్రకీలాద్రి దుర్గ అమ్మవారు గుర్తు వస్తుంది . చారిత్రాత్మక కలిగిన ఆలయాల్లో దుర్గాభవానీ ఆలయం మొదటిది కాగా .. మరొకటి మొగల్రాజపురం ధనకొండ ఒక‌టి..... దుర్గమ్మ కొలువైన కొండ అని ఇప్పటికీ ఇక్కడి ప్రజలు నమ్ముతారు. పురాత‌న చ‌రిత్ర క‌ల్గిన ఈ ధ‌న‌కొండ విశిష్టత గురించి తెలుసుకుందాం . విజయవాడలోని మొగల్రాజపురం కొండ పైన ఒక గుహలో చాలా ఏళ్ళ కిందట ఒక విచిత్రమైన అమ్మవారు రూపు వెలిసింది .ఇంద్రకీలాద్రిపై అమ్మ కొలువు […]

విజయవాడ అనగానే మనకు ఇంద్రకీలాద్రి దుర్గ అమ్మవారు గుర్తు వస్తుంది . చారిత్రాత్మక కలిగిన ఆలయాల్లో దుర్గాభవానీ ఆలయం మొదటిది కాగా .. మరొకటి మొగల్రాజపురం ధనకొండ ఒక‌టి..... దుర్గమ్మ కొలువైన కొండ అని ఇప్పటికీ ఇక్కడి ప్రజలు నమ్ముతారు. పురాత‌న చ‌రిత్ర క‌ల్గిన ఈ ధ‌న‌కొండ విశిష్టత గురించి తెలుసుకుందాం .

విజయవాడలోని మొగల్రాజపురం కొండ పైన ఒక గుహలో చాలా ఏళ్ళ కిందట ఒక విచిత్రమైన అమ్మవారు రూపు వెలిసింది .ఇంద్రకీలాద్రిపై అమ్మ కొలువు తీరడానికి ముందే , ధనకొండ పై ఈ అమ్మవారు వెలిసిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ;. . విజయవాడలో ఉన్న వెనకటి తరాల వారికి మాత్రం అసలు కనకదుర్గమ్మ ముందుగా మొగల్రాజపురం ధనకొండపై వెలసిందని చెపుతుంటారు . ఇప్పటికీ అమ్మవారు పగలంతా ఇంద్రకీలాద్రి మీద ఉండి, రాత్రి ఒక చిన్న పాప రూపంలో ధనకొండకు వస్తుందంటున్నారు స్థానికులు.

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఎంతటి మహిమాన్వితురాలో మొగల్రాజపురంలో ఈ కొండపై వెలిసిన దుర్గమ్మ కూడా అంతే మహిమ గలదని భక్తుల విశ్వాసం. ఈ అమ్మవారిని దర్శి౦చుకొని కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం.. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికీ వివాహం , ఆర్ధిక, ఆరోగ్య, ఎలాంటి సమస్యల గురించి మొక్కుకున్న నెరవేరుతాయని చెపుతుంటారు , ఈ కొండపై ఒక చిన్న గుహలో అమ్మవారు శ్రీచక్ర పీఠంపై పాదముద్రలు, నేత్రంతో వెలసిందంటారు. ఇది నిజమేన‌ని అనడానికి సాక్ష్యంగా ఇప్పటికీ అంతరాలయంలో అమ్మవారి పాద ముద్రలు, నేత్రంతో ఉన్న శ్రీచక్రపీఠం ఉంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ రూపం కనపడదు.. అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది. ఈ రూపం కింద భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది. మరోవైపు అమ్మవారి గర్బగుడిపైన గోపురం ఉన్న ప్రాంతంలో శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు.

దశాబ్దాల క్రితం అడవిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక గొల్లవానికి గుహలో దర్శనం ఇచ్చిన అమ్మవారు .., నీకేం కావాలో కోరుకోమనగా పేదరికంతో ఉన్న తనను ఆదుకోమని అభ్యర్థించాడట. అమ్మ కరుణించి కొంత ధనాన్ని ఇచ్చి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లు... ఎటువంటి శబ్దం వచ్చినా చూడొద్దని.. చూస్తే శిలగా మారిపోతావని ఆదేశించింద‌ట. గుహ వద్ద నుంచి కిందకు బయల్దేరిన గొల్లవాడు కొంత దూరం వచ్చేసరికి వెనుక నుంచి శబ్దాలు, డప్పుల చప్పుళ్లు వినబడటంతో వెనక్కి తిరిగి చూసాడట . వెంటనే అతను ఒక పెద్ద బండ రాయిగా మారిపోయాడట. ఇప్పటికీ ఆ గుహకు కింద భాగం లో ఈ బండరాయి ని చూడవచ్చు ...దీనినే గొల్లబండ అని పిలుస్తారు . ప్రస్తుతానికి కొండ కింద నుంచి పైకి వెళ్లడానికి మెట్లు ఆ పై నుంచి గుడి వరకు సిమెంట్‌ రోడ్డు ఉంది. కాలి మార్గంలో నవదుర్గలు, క్షేత్రం ప్రధాన ద్వారం వద్ద వినాయక, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఈ కొండపై అమ్మవారు 200 ఏళ్ల క్రితం నుంచే పూజలు అందుకుంటుందని స్థానికులు చెబుతుంటారు ఇప్పటికీ కొండ పరిసర ప్రాంతాల్లో గజ్జెల శబ్దం వినిపిస్తుంటుందని స్థానికులు చెబుతుంటారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో అమ్మవారికి అభిషేకాలు జరుగుతుంటాయి. ప్రతి ఏటా ఇక్కడ న‌వ‌రాత్రుల్లో అమ్మవారికి ఉత్స్తవాలు చేయ‌డం , దసరా పండగ రోజున మేళ‌తాళాలు, మంగ‌ళ‌వాయిద్యాల‌తో అమ్మవారిని న‌గ‌ర పుర‌వీధుల్లో ఊరేగింపు జ‌ర‌ప‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. అమ్మవారి మ‌హ‌త్యం తెలిసిన భ‌క్తులు ఏటా దేశం న‌లుమూల‌ల నుంచి ఇక్కడికి వస్తూ ధ‌న‌కొండ‌పై వెల‌సిన దుర్గమ్మను ద‌ర్శించుకుని వెళుతుంటారు.

Updated On 9 Feb 2023 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story