తమిళనాడులోని తిరుచ్చిలో ఓ దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ మహిళ తలపై కొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు ఓ దొంగ ప్రబుద్ధుడు. దీంతో స్పృహ తప్పిన ఆమెను రోడ్డు పై నుంచి పుట్ పాత్ వైపుకు లాక్కెళ్లి చోరికి ప్రయత్నించాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళనాడులోని తిరుచ్చిలో ఓ దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ మహిళ తలపై కొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు ఓ దొంగ ప్రబుద్ధుడు. దీంతో స్పృహ తప్పిన ఆమెను రోడ్డు పై నుంచి పుట్ పాత్ వైపుకు లాక్కెళ్లి చోరికి ప్రయత్నించాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళనాడు లోని అన్నా యూనివర్సిటీలో సీతా లక్మి ప్రొఫెసర్ గా పని చేస్తొంది. ఆదివారం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై సెంథిల్ కుమార్ ఆమె తలపై చెక్క పలకతో గట్టిగా కొట్టేశాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమె కాళ్లు పట్టుకొని పుట్ పాత్ పైకి కొంతదూరం లాక్కెళ్లి... ఆమె వద్ధ ఉన్న టూ వీలర్ కీస్ తీసుకోవడంతో పాటు ..సెల్ ఫోన్ కూడా తీసుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు . అయితే నిందితున్ని గుర్తించి ... టూ వీలర్ పై ప్రయాణిస్తున్న నిందితున్ని పోలీసులు వెంబడించడంతో ..పోలీసులను తప్పించుకునే క్రమంలో రోడ్డు మధ్యలోని డివైడర్ ను ఢీ కొట్టి పడిపోవడంతో అతడి కాలికి గాయమైంది. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

Updated On 17 March 2023 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story