ఎదురు కట్నం ఇచ్చి మరి పెళ్ళికి ఒప్పించారు అమ్మాయిని. ఇచ్చిన కట్నం సరిపోదు అని పీటల మీద పెళ్లి ఆపి మరి వెళ్ళిపోయింది పెళ్లికూతురు . భలే ఉంది కదా ట్విస్ట్!

పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిలు తక్కువయి పోయారు ..పెళ్లి చేసుకొనే అమ్మాయిలు దొరక్క వయసు దాటుపోతున్నాయి చాల మందికి . అమ్మాయిలు తక్కువ అయితే ఎదురు కట్నాలతో పెళ్లిళ్లు తప్పవు అనేమాట ఎప్పటినుండో వినిపిస్తుంది . సరిగ్గా ఈ పెళ్లిలో కూడా ఆలాగే జరిగింది .ఎదురు కట్నం ఇచ్చి మరి పెళ్ళికి ఒప్పించారు అమ్మాయిని. ఇచ్చిన కట్నం సరిపోదు అని పీటల మీద పెళ్లి ఆపి మరి వెళ్ళిపోయింది పెళ్లికూతురు . భలే ఉంది కదా ట్విస్ట్!

అమ్మాయిలు కోసం అబ్బాయిలు ఎదురుకట్నాలు ఇవ్వటం తో పాటు ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి పీటల మీది పెళ్లి ఆపుచేసింది ఒక పెళ్లి కూతురు దానితో దిమ్మతిరిగింది అబ్బాయి తరపు పెళ్లి వాళ్లకి . పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కాలనీ కి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కు చెందిన యువతీ తో పెళ్లి కుదిరింది . అబ్బాయి తరుపువారు అమ్మాయికి 2 లక్షల రూపాయలు కట్నం ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో పెళ్లి మాటలు జరిపారు . మార్చ్ 9 గురువారం రాత్రి 7. 22 ని.ల.కి ముహూర్తం ఖాయం చేసి ఘాట్ కేసర్ లో ని ఫంక్షన్ హాళ్లలో పెళ్లి ఏర్పాట్లు చేసుకొని భందువులకు పెళ్లి పత్రికలూ ఇచ్చి ఆహ్వానం పలికారు. పెళ్లి మండపం అంత బంధువులతో కోలాహలం గా సందడి గా ఉంది .మరికాసేపట్లో ముహూర్తం .కానీ పెళ్లి కూతురువారు ఎక్కడ కనిపించలేదు .

అసలు ఎం జరిగిందని ఆరా తీయగా ఒప్పందం ప్రకారం అబ్బాయి తరుపు వారు ఇస్తున్న కట్నకానుకలు తనకు ఏ మాత్రం సరిపోవని అమ్మాయి పెళ్లి పీటలు ఎక్కడానికి నిరాకరించింది. దానితో పెళ్లి ఆగిపోయింది. గొడవ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అమ్మాయి తరుపువారు ఇచ్చిన 2లక్షల కట్నం డబ్బుని వాడుకోవటం కూడా జరిగింది .

కట్నాల కోరికలతో ఏంటో మంది ఆడపిల్లల ను ఇప్పటికి వేధిస్తున్న ఈ రోజుల్లో కట్నం సరిపోలేదని అబ్బాయిని కాలుదన్ని వెళ్ళిపోవటం శబాష్! అనికొంతమంది అంటున్నారు .

Updated On 10 March 2023 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story