ఖమ్మం (Khammam)జిల్లాలోని ఒక యువకుడు మరణం అక్కడున్న వారందరిని కన్నీటి పెట్టిస్తుంది.ఆస్ట్రేలియాలో(Australia) ఉంటున్న హర్షవర్ధన్ (Harshavardan)(33) కి తాను చనిపోతానని ముందే తెలుసు .తాను చనిపోయాక శవం ఇండియా(India) కి తీసుకెళ్లే పనులు కూడా తాను ముందుగానే స్వయంగా చేసుకున్నాడు . తన తల్లితండ్రుల(parents) సమక్షంలో అంత్య క్రియలు జరగాలని ఇండియా కి తన మృతదేహం వెళ్ళటానికి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని తన చేతులతో తానే చేసుకున్నాడు . నేను త్వరలోనే చనిపోతున్న అమ్మ నాన్న దైర్యంగా ఉండండి అంటూ ముందు నుండి వాళ్లకు ధైర్యాన్ని చెప్పేవాడు. చివరకు మార్చి 24 న హర్షవర్దన్ అనారోగ్యం తో కన్నుమూయగా అతని మృతదేహానికి బుధవారం(Wednesday) ఖమ్మంలో అంత్యక్రియలు నిర్వహించారు ఎం జరిగిందంటే ?

ఖమ్మం (Khammam)జిల్లాలోని ఒక యువకుడు మరణం అక్కడున్న వారందరిని కన్నీటి పెట్టిస్తుంది.ఆస్ట్రేలియాలో(Australia) ఉంటున్న హర్షవర్ధన్ (Harshavardan)(33) కి తాను చనిపోతానని ముందే తెలుసు .తాను చనిపోయాక శవం ఇండియా(India) కి తీసుకెళ్లే పనులు కూడా తాను ముందుగానే స్వయంగా చేసుకున్నాడు . తన తల్లితండ్రుల(parents) సమక్షంలో అంత్య క్రియలు జరగాలని ఇండియా కి తన మృతదేహం వెళ్ళటానికి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని తన చేతులతో తానే చేసుకున్నాడు . నేను త్వరలోనే చనిపోతున్న అమ్మ నాన్న దైర్యంగా ఉండండి అంటూ ముందు నుండి వాళ్లకు ధైర్యాన్ని చెప్పేవాడు. చివరకు మార్చి 24 న హర్షవర్దన్ అనారోగ్యం తో కన్నుమూయగా అతని మృతదేహానికి బుధవారం(Wednesday) ఖమ్మంలో అంత్యక్రియలు నిర్వహించారు ఎం జరిగిందంటే ?

ఖమ్మం (Khammam)జిల్లా కు చెందిన శ్రీనివాస్ నగర్ (Srinivas nagar)లో నివాసం ఉంటున్న ఏపూరి రామారావు (evuri ramarao),ప్రమీల (prameela)దంపతులకు ఇద్దరు కుమారులు తండ్రి రామారావు వ్యాపారస్తుడు(business man) తల్లి హెడ్ మాస్టర్ గా (principal)పని చేస్తున్నారు . కొడుకులు హర్షవర్ధన్ ,అఖిల్ .. హర్షవర్ధన్ బి ఫార్మసీ పూర్తి చేసి 2013 లో ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లడం జరిగింది . జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన హర్ష వర్ధన్ క్వీన్స్ ల్యాండ్(Queensland) లో ప్రైవేట్ హాస్పిటల్ లో డాక్టర్(doctor) గా పనిచేస్తున్నారు . 2020 ఫిబ్రవరి 20 న ఖమ్మంలో హర్షవర్ధన్ వివాహం జరిగింది. వీసా వచ్చాక భార్యను తీసుకువెళ్తానని చెప్పి అదే నెల 29న తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఒకరోజు అకస్మాత్తుగా బాడ్మింటన్ (badminton)ఆడుతున్న హర్షవర్ధన్ కి దగ్గు ఆయాసం రావటంతో అనుమానం వచ్చి డాక్టర్లను సంప్రదించగా పరీక్షలు నిర్వహించి అతనికి ఊపిరి తిత్తుల కాన్సర్(lung cancer) అని తేల్చి చెప్పారు . ఇంట్లో వాళ్ళు ఇండియా కి వచ్చేయమని ఎంతో నచ్చ చెప్పారు . కానీ ఇక్కడే మంచి వైద్యం ఉంటుందని వాళ్ళని ఒప్పించాడు .

కాన్సర్(cancer) వచ్చినప్పటినుండి ఇంట్లో వాళ్ళు బెంగ పడటం తో వాళ్ళకి ఎంతో దైర్యం చెప్పేవారు . అలాగే కాన్సర్ కి ట్రీట్మెంట్(treatment) తీసుకున్నాక వ్యాధి నయమైపోయిందని అక్కడ వాళ్ళు చెప్పారు .ఆ తరువాత2022 సెప్టెంబర్ లో ఆనందం తో కొన్ని రోజులు ఖమ్మం వెళ్ళాడు హర్షవర్ధన్ (harshavardan)15 రోజులు అక్కడున్నాక తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళాక అతని రోగం మళ్ళీ తిరగపెట్టింది ..ఈ సారి ఇక కాన్సర్ నయం కాదని డాక్టర్లు తేల్చి చెప్పారు .మంచి మనసున్న హర్షవర్ధన్ ముందుగానే తన భార్య కి విడాకులు ఇచ్చాడు . ఆమెకు ఆర్థికంగా (financial)అన్ని సమకూర్చాడు . తన భవిష్యత్తు కు ఎలాంటి లోటు లేకుండా చూసాడు . తాను త్వరలోనే మరణిస్తాను అని తన బంధువులతో ,తల్లి తండ్రులతో ముందుగానే చెప్పాడు . లాయర్ ను సంప్రదించి తన మృతదేహం ఇండియాకి పంపించే విషయాలన్నీ ముందు గానే ఏర్పాట్లు చేసుకున్నాడు . తన చివరి నిమిషం వరకు కూడా తల్లి తండ్రులతో ,బంధువులతో వీడియో కాల్స్ లో తరచు మాట్లాడుతూ వాళ్లకి దైర్యం చెప్పేవాడు .

అన్ని బాగుంటే మే నెలలో హర్షవర్ధన్ ఇండియాకి రావాల్సి ఉంది . తమ్ముడు అఖిల్ (Akhil)వివాహం మే లో జరగబోతుంది .అందరితో సంతోషం గా గడిపే క్షణాల కోసం హర్షవర్ధన్ ఎంతగానో ఎదురుచూశాడు .కానీ ఇంతలోనే మృత్యువు అతన్ని మింగేసింది . మార్చి 24 హర్షవర్ధన్ ప్రాణాలతో పోరాడుతూ తుదిశ్వాస విడిచాడు. అనుకున్నట్లుగానే మృతదేహం(dead body) ఇండియాకి తరలించబడింది. బుధవారం ఖమ్మం చేరుకున్న హర్షవర్ధన్ పార్థివదేహానికి తల్లి తండ్రులు ఊర్లో వాళ్ళు నివాళులు అర్పించి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు . ఈ సంఘటన స్థానికులకు కంటనీరు పెట్టించింది .

Updated On 6 April 2023 12:43 AM GMT
Ehatv

Ehatv

Next Story