ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో మార్మోగుతున్న పేరు కుమారి ఆంటి (Kumari Aunty). హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి (Cable Bridge) ప్రాంతంలో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారం చేస్తున్న ఆమె పాపులరయింది. యూట్యూబ్‌ ఛానెల్స్ ఆమె వ్యాపారాన్ని విపరీతంగా ప్రమోట్‌ చేయడంతో ఫుడ్ లవర్స్ ఫోటెత్తారు. పలువురు సెలబ్రిటీలు ఆమె ఫుడ్‌ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో మార్మోగుతున్న పేరు కుమారి ఆంటి (Kumari Aunty). హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి (Cable Bridge) ప్రాంతంలో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారం చేస్తున్న ఆమె పాపులరయింది. యూట్యూబ్‌ ఛానెల్స్ ఆమె వ్యాపారాన్ని విపరీతంగా ప్రమోట్‌ చేయడంతో ఫుడ్ లవర్స్ ఫోటెత్తారు. పలువురు సెలబ్రిటీలు ఆమె ఫుడ్‌ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో జనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌ పోలీసులు (Traffic Police) రంగంలోకి దిగి రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని చెప్పారు. దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదం చేసింది. తన పొట్ట కొడుతున్నారని ఆవేదన చెందింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే విషయం సీఎం రేవంత్‌ (CM Revanth) దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి అదే ప్రాంతంలో ఫుడ్‌ స్టాల్‌ పెట్టుకునేందుకు పోలీసులు సహకరించాలని సూచించారు. ఆ మేరకు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

అయితే తాజాగా కుమారి ఆంటీని బిగ్‌బాస్‌ సీజన్‌-8లో (BiggBoss Season-8) కంటెస్టెంట్‌గా తీసుకోవాలని ఆ షో నిర్వాహకులు ఆలోచనలు చేస్తున్నారట. కుమారి ఆంటీని బిగ్‌బాస్‌ షోకు తీసుకోనున్నారని సోషల్‌ మీడియాలో వార్త ట్రెండింగ్‌ అవుతోంది. ఒక మహిళ తన సొంత కాళ్లపై నిలబడి.. స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్ముతూ తన కుటుంబమే కాకుండా పలువురికి ఉపాధి కల్పించడంతో ఈమె బిగ్ బాస్‌ షో నిర్వాహకుల దృష్టిని ఆకర్షించింది. మహిళా ఎంపవర్‌మెంట్‌ అంటే ఏంటో కుమారి ఆంటి నిరూపించిందని అందుకే ఈ షోలో కంటెస్టెంట్‌గా ఆమెను తీసుకుంటే ఎలా ఉంటుందనే విషయంపై కసరత్తు చేస్తున్నారట. అయితే అందుకు ఆమె కూడా ఒప్పుకోంటుందా లేదా అనే కోణంలో ఆలోచన చేస్తున్నారట. బిగ్‌బాస్‌ షోకు వెళ్తే తన వ్యాపారం ఏమవుతుందోనన్న ఆందోళన కూడా తనకు వచ్చే అవకాశముందని.. ఆమె భయాలను తొలగించి ఈ షోలో పాల్గొనెలా చేయాలని చూస్తున్నారట. మరి కమింగ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌లో కుమారి ఆంటి కనపడతుందో లేదో చూడాలి.

మరోవైపు కుమారి ఆంటీకి సోషల్‌ మీడియాలో లక్షల్లో ఫాలోయింగ్‌ పెరిగిపోతుంది. ఆమె వీడియోలను విపరీతంగా ట్రెండింగ్‌ చేస్తున్నారు. సెలబ్రిటీల దృష్టిని ఆకర్షిస్తోందామె. ప్రముఖ నటుడు సందీప్‌ కిషన్‌ (Actor Sandip Kishan) తన ట్విట్టర్‌లో కుమారి ఆంటీని పొగుడుతూ ఓ పోస్టును షేర్‌ చేశాడు. ఉమెన్‌ ఎంపర్మెంట్‌కు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచిందని రాసుకొచ్చాడు. ఆమెకు ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా నా బృందం సహాయం చేస్తుందని తెలిపాడు.

Updated On 31 Jan 2024 11:12 PM GMT
Ehatv

Ehatv

Next Story