నమ్మేవాళ్లు ఉన్నంత కాలం దొంగబాబాలు, దొంగస్వాములు పుట్టుకొస్తూనే ఉంటారు. భక్తుల చెవుల్లో పూలు పెడుతూనే ఉంటారు. పాలమూరులో(Palamuru) తాజాగా ఓ దొంగస్వామి అవతరించాడు. మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుడను(Lord Srinivas) తానేనని, తన చుట్టూ తిరిగిన వారికి కష్టాలు మటుమాయం అవుతాయని చెప్పాడా కొత్త దేవుడు. ఆ కొత్త దేవుడి మాటలకు ఫ్లాటయ్యారు ప్రజలు.

నమ్మేవాళ్లు ఉన్నంత కాలం దొంగబాబాలు, దొంగస్వాములు పుట్టుకొస్తూనే ఉంటారు. భక్తుల చెవుల్లో పూలు పెడుతూనే ఉంటారు. పాలమూరులో(Palamuru) తాజాగా ఓ దొంగస్వామి అవతరించాడు. మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుడను(Lord Srinivas) తానేనని, తన చుట్టూ తిరిగిన వారికి కష్టాలు మటుమాయం అవుతాయని చెప్పాడా కొత్త దేవుడు. ఆ కొత్త దేవుడి మాటలకు ఫ్లాటయ్యారు ప్రజలు.

ఆయన దర్శనం కోసం క్యూలు కట్టారు. ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆ దొంగస్వామి తమిళనాడుకు చెందిన వ్యక్తి. పేరు రంగనాథం(Ranganatham). పామూలరులో సెటిల్‌ అయ్యాడు. తాను దేవుడినని, ఏ రోగమైనా ఇట్టే నయం చేస్తానని ప్రచారం చేసుకున్నాడు. కేటిదొడ్డి మండలం కొండాపురం స్జేజ్‌ దగ్గర కొలువు తీరాడు.. ఈయన బిల్డప్‌ మామూలుగా లేదు. విష్ణుమూర్తి రూపాన్ని ధరించాడు.

శేషతల్పంపై నిద్రిస్తూ తన ఇద్దరు భార్యలతో కాళ్లు వత్తించుకుంటూ పోజులిచ్చాడు. ఇది చూసిన జనం ఆహో ఓహో అనుకున్నారు. పది మందికి ప్రచారం చేశారు. దాంతో భక్తుల రద్దీ పెరిగింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేటంతగా జనం రావడంతో పోలీసులు స్వామిని మరో ప్రాంతానికి తరలించారు. అన్నట్టు ఆ దొంగ బాబాకు గతంలోనే పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారట! ఈ దొంగస్వామిని నమ్మి నష్టపోకండంటూ ప్రజలకు హితవు చెప్పారు.

Updated On 20 Jun 2023 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story