ఈ టైటిల్ పోస్ట‌ర్‌ను మార్చి 30 శ్రీరామ న‌వ‌మికి రిలీజ్ చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్‌. ప్ర‌స్తుతం SSMB 28 షెడ్యూల్‌ను హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీక‌రిస్తున్నారు. పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వం(Direction)లో ఓ సినిమాను చేస్తున్నాడు మహేష్ బాబు.(Maheshbabu) సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ (Trivikram)కాంబినేష‌న్‌లో మూడోసారి రూపొందుతోన్నఈ మూవీ వ‌ర్కింగ్ టైటిల్‌ SSMB 28. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలోకి దిగుతుందనే టాక్ వస్తోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా టైటిల్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు రానున్న శ్రీరామ న‌వమికి SSMB 28 టైటిల్‌ను (SSMB 28 title) అనౌన్స్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ మూవీ టైటిల్ గురించి చాలా పేర్లే వినిపించాయి. అయితే ఈ టైటిల్స్ విష‌యంలో త్రివిక్రమ్ కి ఓ సెంటిమెంట్ ఉంద‌నే సంగ‌తి తెలిసిందే. ఆయ‌న త‌న సినిమా టైటిల్స్ ఎక్కువ‌గా అ అనే అక్ష‌రంతో మొద‌ల‌య్యేలానే చూసుకుంటారు.

SSMB 28 కు కూడా అదే సెంటిమెంట్‌(Sentiment)ను రిపీట్ చేస్తున్నార‌ట‌. ఈ చిత్రానికి ‘అమరావతికి అటు ఇటు’ (Amaravathiki Atu Itu) అనే టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌, అల్లు అర్జున్‌కి అల వైకుంఠ‌పురములో వంటి సాఫ్ట్ టైటిల్స్ పెట్టిన‌ప్ప‌టికీ క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ అందుకున్న త్రివిక్ర‌మ్ ఇప్పుడు మ‌హేష్‌కి కూడా అమ‌రావ‌తికి అటు ఇటు అనే టైటిల్ వైపే మొగ్గు చూపుతున్నారట ఈ టైటిల్ పోస్ట‌ర్‌ను మార్చి 30 శ్రీరామ న‌వ‌మికి రిలీజ్ చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్‌. ప్ర‌స్తుతం SSMB 28 షెడ్యూల్‌ను హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీక‌రిస్తున్నారు. పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను మొదట ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, షూటింగ్ ఆటంకాల కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు
ఈ సినిమా జనవరి 13న విడుదలవుతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం సూప‌ర్‌స్టార్ సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. దీని త‌ర్వాత మ‌హేష్ బాబు త‌న 29వ చిత్రాన్ని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

Updated On 27 March 2023 4:10 AM GMT
Ehatv

Ehatv

Next Story