.ఒకే మండపం లో ఇద్దరి తల్లుల మేడలో ఒకేసారి తాళి కట్టిన కధనం ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో ఈ వింత పెళ్లి పెద్దల సమక్షంలో అందరి ఆశీస్సులతో జరిగింది.

రెండు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళని ,ఇద్దర్ని ప్రేమించినవారిని ఇలా చాల రకాలు కథలు మనం ఎక్కడో చోట వినడం చూడటం జరిగేవుంటుంది . కానీ ఈ పెళ్ళికొడుకు మామూలోడు కాదు. ఇద్దరు తల్లుల్ని ఒకేసారి పెళ్లిచేసుకున్న ఘనత సంపాదించుకున్నాడు . వినటానికి కాస్త విడ్డురం గా ఉన్న .ఒకే మండపం లో ఇద్దరి తల్లుల మేడలో ఒకేసారి తాళి కట్టిన కధనం ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంజిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో ఈ వింత పెళ్లి పెద్దల సమక్షంలో అందరి ఆశీస్సులతో జరిగింది.

విషయం ఏంటి అంటే ? డిగ్రీ డిస్ కంటిన్యూ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్న సత్తిబాబు అనే యువకుడు తోటి విద్యార్థి స్వప్నకుమారికి మనసు ఇచ్చాడు . వీరీ ప్రేమాయణం కాస్త సహజీవనం వరకు వెళ్ళింది. ఇదే సమయంలో సత్తిబాబు మరదలు అయిన సునీతతో కూడా ప్రేమాయణం నడిపాడు . వీళ్ళిద్దరితో 3 ఏళ్ళ పాటు సహజీవనం చేస్తున్నాడు . ఇది ఇద్దరు అమ్మాయిలకు తెలిసిన వారిలో గొడవలు ఎం జరుగకపోగా ముగ్గురు కలిసి మెలిసి ఉంటున్నారు. స్వప్నకుమారికి ఒక కూతురు, సునీతకు ఒక కొడుకుపుట్టారు . భార్యలిద్దరూ ఇప్పుడు మళ్లీ గర్భవతులు .

సత్తిబాబు కుటుంబ ఆచారం ప్రకారం అక్కడ పెళ్ళికి ముందు సహజీవనం తప్పు కాదు. పిల్లలు పుట్టాక ఇరు యువతుల తల్లితండ్రులు రంగం లో కి దిగి సత్తిబాబు ని పెళ్లి విషయంలో నిలదీయగా ఇద్దర్ని పెళ్లి చేసుకోవడానికి తనకు ఇష్టం అని చెప్పాడు. ఆ ఇద్దరు యువతులు కూడా పెళ్లి కి ఓకే చెప్పేవారు. ఇంకేముంది ఒక మంచి ముహూర్తం చూసి ఇద్దరి తల్లుల్ని ఒకేసారి పెళ్లాడాడు సత్తిబాబు.
సత్తిబాబు పెళ్లి పత్రిక ,వీడియోస్ నెట్టింట్లో వైరల్ గా మారాయి .

ఒక పెళ్ళాంతోనే అంతంతమాత్రంగా సాగుతున్నకాపురాలు ఉన్న ఇప్పుడు పరిస్థితుల్లో ఇద్దరుపెళ్ళాలు ,పైగా నలుగురు పిల్లలుతో ఎలా వేగుతావ్ రా !బాబు అంటూ సత్తిబాబు నువ్వు సూపర్ ఎహే !అంటున్నారు .

Updated On 10 March 2023 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story