హోలీ సంబరాల్లో భాగంగా గ్రామంలో హోలీ ఆడుతూ అబ్బయ్య అనే వ్యక్తి సంతోషంతో షబ్బీర్ పై రంగు చల్లాడు. నాపై రంగు ఎందుకు చల్లావు అంటూ కోపంతో షబ్బీర్ అబ్బయ్య తో గొడవకు దిగాడు.

సరదాగా, సంతోషంగా కలిసి ఆడుకోవలసిన హోలీ వేడుకల్లో అప‌శ్రుతి చోటుచేసుకుంది.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. చివరికి ఒక వ్యక్తి ప్రాణ మీదకు తీసుకువచ్చింది. మెదక్ జిల్లా రేగోడు మండలం మర్పల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

హోలీ సంబరాల్లో భాగంగా గ్రామంలో హోలీ ఆడుతూ అబ్బయ్య అనే వ్యక్తి సంతోషంతో షబ్బీర్ పై రంగు చల్లాడు. నాపై రంగు ఎందుకు చల్లావు అంటూ కోపంతో షబ్బీర్ అబ్బయ్య తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. వెంటనే షబ్బీర్ పెట్రోల్ చల్లి నిప్పు అంటించాడని ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు తెలుస్తోంది. గాయపడిన అబ్బయ్య ను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు వెల్లడించారు.

Updated On 7 March 2023 7:17 AM GMT
Ehatv

Ehatv

Next Story