సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నిర్మించిన తాజా సినిమా‘యానిమల్‌’ (Animal). ఈ సినిమా బాలీవుడ్‌లో బీభత్సం సృష్టించింది. రష్మిక (Rashmika), అనిల్‌కపూర్‌ (Anil Kapoor), బాబీ డియోల్‌ (Bobby Deol), త్రిప్తి డిమ్రి (Tripti Dimri)  కీలక పాత్రలు పోషించారు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో డిసెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా బొచ్చెడు కలెక్షన్లు రాబట్టింది.

సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నిర్మించిన తాజా సినిమా‘యానిమల్‌’ (Animal). ఈ సినిమా బాలీవుడ్‌లో బీభత్సం సృష్టించింది. రష్మిక (Rashmika), అనిల్‌కపూర్‌ (Anil Kapoor), బాబీ డియోల్‌ (Bobby Deol), త్రిప్తి డిమ్రి (Tripti Dimri) కీలక పాత్రలు పోషించారు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో డిసెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా బొచ్చెడు కలెక్షన్లు రాబట్టింది.

తాజాగా ఈ చిత్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఇచ్చిన ఇంటర్వ్యలో ఆసక్తి కర అంశాలు వెల్లడించారు. యానిమల్‌ సినిమాలోని గీతాంజలి (Geethanjali) పాత్రలో తాను మొదటగా బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra)ను ఎంచుకున్నామని ఆయన తెలిపారు. కొన్ని కారణాలతో పరిణీతి చోప్రాతో కలిసి పనిచేయలేకపోయామని అన్నారు. ఈ విషయంలో ఆమెను ఆయన క్షమాపణలు కూడా కోరారట. ఈ సందర్భంగా సందీప్‌రెడ్డి మాట్లాడుతూ 'ఆమె నటనంటే నాకు చాలా ఇష్టం, కబీర్‌సింగ్‌లో (Kabir Sing) కూడా ప్రీతి (Preethi) పాత్రలో ఆమెనే తీసుకోవాలని అనుకున్నా కానీ ఆ సమయంలో కుదరలేదు. ఆమెను నా సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవాలని ఎప్పటి నుంచో ఆశతో ఉన్నానన్నారు'. అయితే యానిమల్‌ మూవీలో గీతాంజలి పాత్రలో పరిణీతిని ఎంపిక చేసుకున్నా.. ఇందుకు సంబంధించి షూటింగ్‌కు ఏడాదిన్నరకు ముందే ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా తీసుకున్నాం. కానీ గీతాంజలి పాత్రలో ఆమెను చూడలేకపోయా.. సినిమా కోసమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాని స్పష్టంగా చెప్పా. నా మాటలకు ఆమె ఎంతో బాధపడింది కానీ.. తర్వాత అర్థం చేసుకుందని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సినిమాలో గీతాంజలి పాత్రలో తనదైన శైలిలో నటించిన రష్మిక ప్రేక్షకుల మన్ననలు పొందిందనే చెప్పాలి.

Updated On 24 Dec 2023 3:56 AM GMT
Ehatv

Ehatv

Next Story