కుటుంబంలో వివాదం...మంచు లక్ష్మి సంచలన పోస్ట్!

మంచు కుటుంబంలో గొడవలు సినిమా పరిశ్రమ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇన్ని రోజులూ గుట్టుగా సాగిన ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు. రచ్చకెక్కాయి. పోలీసు కేసులు, ఘర్షణల వరకు దారితీశాయి. జల్పల్లిలోని మోహన్ బాబు జర్నలిస్టులపై (journalists) దాడి చేయడం కూడా ఉద్రిక్తతకు దారి తీసింది. దాడి తర్వాత మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన మానసిక స్థితి సరిగా లేదని వైద్యులు తెలిపారు. ( మీకు బాలకృష్ణ కేసు గుర్తుకు వచ్చే ఉంటుంది). ఈ ఘటనల తర్వాత మోహన్బాబు కూతురు మంచు లక్ష్మి (Lakshmi Manchu) ఇన్స్టాగ్రాం లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.తన ఫిట్నెస్, డైలీ రొటీన్, కుమార్తెకు సంబంధించిన విశేషాలను మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా తన కూతురు నిర్వాణ చిరునవ్వులు చిందిస్తోన్న ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకు ‘పీస్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పోస్ట్ చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంట్లో అంత పెద్ద గొడవ జరుగుతుంటే.. మంచు లక్ష్మి మాత్రం ఇన్స్టాలో బిజీగా ఉంది అంటూకామెంట్లు చేస్తున్నారు
