తల్లిదండ్రులు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారిని తలొంచుకుని పెళ్లి చేసుకోవడానికి ఈ తరం అమ్మాయిలు సిద్ధంగా లేరు. తమకు నచ్చితేనే మనువాడుతున్నారు. నచ్చకపోతే మొహం మీదనే చెప్పేస్తున్నారు. బీహార్‌లో(Bihar) ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది.

తల్లిదండ్రులు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారిని తలొంచుకుని పెళ్లి చేసుకోవడానికి ఈ తరం అమ్మాయిలు సిద్ధంగా లేరు. తమకు నచ్చితేనే మనువాడుతున్నారు. నచ్చకపోతే మొహం మీదనే చెప్పేస్తున్నారు. బీహార్‌లో(Bihar) ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. బాగల్‌పూర్‌లోని(Bagalpur) కహల్‌గావ్‌ ప్రాంతంలో మరికాసేపట్లో పెళ్లి అనగా, పెళ్లికి వధువు కిట్టూ కుమారి ససేమిరా అనేసింది. చచ్చినా ఈ పెళ్లి చేసుకోనని భీష్మించింది. అందుకు కారణం వయసులో తనకంటే చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడట! పైగా రంగు కూడా తక్కువేనట!

ఇలాంటివాడితో మూడు ముళ్లు ఎలా వేయించుకునేది అంటూ మొండికేసింది. ఊరేగింపుగా వచ్చిన పెళ్లి కొడుకు వివాహవేదిక మీదకు వచ్చిన తర్వాత అతడిని తేరిపారా చూసిన పెళ్లి కూతురు మొహం నిమిషంలో మారిపోయింది. వరుడి మెడలో దండ వేసి , బొట్టు పెట్టేందుకు ఇష్టం లేదని చెప్పింది. వరుడి కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పించే ప్రయత్నాలు చాలానే చేశారు. అనేక హామీలు ఇచ్చారు. అయినా వధువు మాత్రం పట్టినపట్టు వదల్లేదు. పైపెచ్చు మరింత మొండిచేసింది. ఇక లాభం లేదనుకున్న పెళ్లి పెద్దలు వధువు చెప్పినట్టే చేశారు. పెళ్లిని క్యాన్సిల్‌ చేశారు.

Updated On 18 May 2023 5:43 AM GMT
Ehatv

Ehatv

Next Story