టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌(Rakesh Master) హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే! 53 ఏళ్ల రాకేశ్‌మాస్టర్‌ ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతారని ఎవరూ ఊహించలేదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా రాకేశ్‌ మాస్టర్‌ పేరుతో అనేక వివాదాలు వస్తున్నాయి. రాకేశ్‌ మాస్టర్‌ మూడో(3rd wife) భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మిపై(Lakshmi) పలువురు దాడి(Attack) చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో(Punjagutta) ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమెపై అయిదుగురు మహిళలు(women) ఒక్కసారిగా వచ్చి లక్ష్మిపై దాడి చేశారు.

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌(Rakesh Master) హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే! 53 ఏళ్ల రాకేశ్‌మాస్టర్‌ ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతారని ఎవరూ ఊహించలేదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా రాకేశ్‌ మాస్టర్‌ పేరుతో అనేక వివాదాలు వస్తున్నాయి. రాకేశ్‌ మాస్టర్‌ మూడో(3rd wife) భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మిపై(Lakshmi) పలువురు దాడి(Attack) చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో(Punjagutta) ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమెపై అయిదుగురు మహిళలు(women) ఒక్కసారిగా వచ్చి లక్ష్మిపై దాడి చేశారు. లక్ష్మి స్కూటర్‌పై వెళుతుండగా లల్లి(Lally) అనే యూట్యూబర్‌(Youtuber) మరో నలుగురు మహిళలతో కలిసి వచ్చి ఆమెపై దాడి చేసింది. ఆమెను నడిరొడ్డుపై జట్టుపట్టుకుని విచక్షణారహితంగా కొట్టారు.

స్థానికులు ఇది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనస్థలికి వచ్చి లక్ష్మిని స్టేషన్‌కు తరలించారు. దాడి చేసిన మహిళలపై లక్ష్మి పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో కంప్లయింట్‌ చేసింది. కాసేపటి తర్వాత లల్లితో పాటు నలుగురు మహిళలు కూడా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. మొదట లక్ష్మినే తమను తిట్టిందని వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు ఆధారాలు కూడా చూపించారు. ఇరువైపులా ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు తర్వాత వారిని పంపించేశారు. లక్ష్మితో పాటు వారందరూ యూ ట్యూబ్‌ ఛానల్స్‌ నడుపుతున్నారు. ఈ విషయంలోనే వీరి మధ్య గొడవ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

తనను రెండు నెలలుగా వీరు చంపుతామని బెదిరిస్తున్నారని లక్ష్మి చెబుతోంది. నెల్లూరుకు చెందిన భారతి అనే మహిళ ఇదంతా చేయించిదని, వీరందరికీ చెరో లక్ష రూపాయలు సుపారి కూడా ఇచ్చిందని ఆరోపిస్తోంది. తనకున్న యూ ట్యూబ్‌ ఛానెల్‌ను నిలిపివేయాలని కొంతకాలంగా బెదిరిస్తున్నారని తెలిపింది. దుర్గ, లల్లి, పెరుగు పెద్దమ్మ, నెల్లూరుకు చెందిన భారతి తనపై దాడి చేశారని పేర్కొంది. ఇదిలా ఉంటే లక్ష్మిపై దాడి చేసిన లల్లి వెర్షన్‌ మాత్రం మరోలా ఉంది. లక్ష్మితో ముందుగా తమకు ఎలాంటి గొడవలు లేవని, తన కూతురును ఉద్దేశిస్తూ చాలా సార్లు యూ ట్యూబ్‌లో అసహ్యంగా మాట్లాడిందని, బూతులు తిట్టిందని, అందుకే ఆమెను కొట్టామని లల్లి అంటోంది.

ఆమె మాట్లాడే మాటల వల్ల తన కూతురు మానసికంగా బాధపడుతుందని పేర్కొంది. రాకేష్ మాస్టర్(Rakesh Master) దగ్గరకు రెండేళ్ల కిందట వంట చేయడానికి వచ్చిన లక్ష్మిని తన భార్యగా రాకేశ్‌ మాస్టర్‌ పలు యూ ట్యూబ్‌ ఛానల్స్‌లో పరిచయం చేశారు. అప్పటికే రాకేశ్‌ మాస్టర్‌కు యూ ట్యూబ్‌ ఛానెల్ ఉండింది. ఆయనకు భారీగా ఫాలోవర్స్‌ ఉండేవారు. అయితే రాకేష్‌ మాస్టర్‌, లక్ష్మిల మధ్య గొడవలు రావడంతో ఆమె మరో ఇంటికి మారిపోయింది. ఆ సమయంలో రాకేష్‌ మాస్టర్‌కు చెందిన యూట్యూబ్‌ ఛానల్‌ను ఆమె లాగేసుకుంది. ఇప్పుడు ఆ ఛానెల్‌ను ఆయన కుటుంబసభ్యులు తీసుకునేందకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ గొడవంతా జరిగినట్టు తెలుస్తోంది.

Updated On 8 July 2023 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story