చిత్తూరు(Chittoor) జిల్లాలో తాగుబోతు వీరంగం సృష్టించాడు. పుంగనూరు(మం) ఈడిగపల్లి జాతీయ రహదారిలో(High Way) మ‌ద్యం మ‌త్తులో తాగుబోతు హల్‌చ‌ల్ చేశాడు. తాగిన మత్తులో లారీకి కారు అడ్డంగా పెట్టిన మందుబాబు..

చిత్తూరు(Chittoor) జిల్లాలో తాగుబోతు వీరంగం సృష్టించాడు. పుంగనూరు(మం) ఈడిగపల్లి జాతీయ రహదారిలో(High Way) మ‌ద్యం మ‌త్తులో తాగుబోతు హల్‌చ‌ల్ చేశాడు. తాగిన మత్తులో లారీకి కారు అడ్డంగా పెట్టిన మందుబాబు.. లారీ డ్రైవర్‌పై దాడి చేశాడు. రాళ్ల‌తో లారీ అద్దాలను సైతం ప‌గ‌ల‌గొట్టాడు. లారీ డ్రైవ‌ర్ 100కు డ‌య‌ల్ చేయ‌డంతో పోలీసులు వెంట‌నే సంఘటన స్థలానికి చేరుకున్నారు. తాగుబోతును అదుపులో తీసుకుని పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

Updated On 16 Jun 2023 4:10 AM GMT
Ehatv

Ehatv

Next Story