అదేమిటో కానీ పెళ్లికి సంబంధించిన చిత్రవిచిత్రమైన ఘటనలన్నీ ఉత్తరభారతంలోనే(Uttar Pradesh) జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని(Rajasthan) భీల్వాడాలో(Bhilwada) ఇలాంటి అనూహ్యఘటనే జరిగింది. ఓ యువకుడు కొత్త పెళ్లి కూతురును ఆమె కుటుంబసభ్యులు, బంధువుల ఎదుటే కిడ్నాప్‌(Kidnap) చేసి తీసుకెళ్లిపోయాడు.

అదేమిటో కానీ పెళ్లికి సంబంధించిన చిత్రవిచిత్రమైన ఘటనలన్నీ ఉత్తరభారతంలోనే(Uttar Pradesh) జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని(Rajasthan) భీల్వాడాలో(Bhilwada) ఇలాంటి అనూహ్యఘటనే జరిగింది. ఓ యువకుడు కొత్త పెళ్లి కూతురును ఆమె కుటుంబసభ్యులు, బంధువుల ఎదుటే కిడ్నాప్‌(Kidnap) చేసి తీసుకెళ్లిపోయాడు. భీల్వాడాలోని బిజోలియాకు చెందిన రవి నాయక్‌కు(Ravi Nayak) లాఛుడాకు చెందిన కవితతో(Kavitha) పెళ్లి ఘనంగా జరిగింది.

అప్పగింతల కార్యక్రమం కూడా ముగిసింది. తర్వాత నూతన వధూవరులు, వారి బంధువులు దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు. ఇంతలో అక్కడికి ముగ్గురు యువకులు స్కూటర్‌(Scooter) మీద వచ్చారు. మారణాయుధాలతో అక్కడ ఉన్నవారిని బెదిరించారు. వధువు మెడపై కత్తిపెట్టి , ఆమెను అక్కడ్నుంచి తీసుకెళ్లిపోయారు. పెళ్లికూతురు తరపువారు ఆ యువకులను కొంత దూరం వరకు వెంబడించారు(chase) కానీ వారిని పట్టుకోలేకపోయారు.

వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వధువుతో పాటు ఆమెను ఎత్తుకెళ్లిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. అప్పగింతల కార్యక్రమం పూర్తయ్యాక తాము భగవంతుడి ఆశీర్వాదం కోసం గుడికి వెళ్లామని, అదే సమయంలో పెళ్లికూతురును కిడ్నాప్‌ చేశారని వరుడు అన్నాడు. ఆ టైమ్‌లో తన భార్య తన చేయి పట్టుకునే ఉందని, తన చేతికి కూడా గాయం అయ్యిందని చెప్పాడు. తన భార్య ప్రేమికుడే ఈ దురాగతానికి పాల్పడి ఉంటాడని పోలీసులతో చెప్పాడు.

Updated On 26 Jun 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story