తెలంగాణా(Telangana)లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) శుభాకాంక్షలు తెలియజేశారు. పదేండ్ల నియంత పాలనను నిలువునా పాతిపెడుతూ.. ప్రజలు కాంగ్రెస్‌(Congress) మీద నమ్మకంతో, సరికొత్త ఆశలతో పట్టం కట్టార‌ని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఒక అద్భుతం ఐతే..

తెలంగాణా(Telangana)లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) శుభాకాంక్షలు తెలియజేశారు. పదేండ్ల నియంత పాలనను నిలువునా పాతిపెడుతూ.. ప్రజలు కాంగ్రెస్‌(Congress) మీద నమ్మకంతో, సరికొత్త ఆశలతో పట్టం కట్టార‌ని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఒక అద్భుతం ఐతే.. ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం మరొక్క మహత్తర ఘట్టం అని పేర్కొన్నారు.

ఇది సుపరిపాలనకు నాంది అని కూడా తాము ఆశిస్తున్నామ‌న్నారు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా.. నిబద్ధత, నిస్పాక్షికతకు మారుపేరుగా ఈ సర్కారు ఉండబోతోందని.. ఇది నూటికి నూరుశాతం నాలుగు కోట్ల ప్రజల నమ్మకమ‌ని పేర్కొన్నారు. YSR తెలంగాణ పార్టీ తరపున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళలా సహకారం, మద్దతు, మనస్ఫూర్తిగా అందించడానికి మేము సిద్దమేన‌ని తెలియ‌జేశారు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీం కాంగ్రెస్ నాయకులకు ట్విట‌ర్ వేదిక‌గా శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated On 8 Dec 2023 2:09 AM GMT
Ehatv

Ehatv

Next Story