వైఎస్సార్టీపీ పార్టీ కీల‌క నేత‌ గట్టు రాంచందర్ రావు నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన‌ ముఖ్య నాయకులు, అన్ని జిల్లాల‌ కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..

వైఎస్సార్టీపీ పార్టీ కీల‌క నేత‌ గట్టు రాంచందర్ రావు(Gattu Ram Chandhar Rao) నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన‌ ముఖ్య నాయకులు, అన్ని జిల్లాల‌ కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి హరీష్ రావు(MInister Harish Rao) సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. వైఎస్సార్టీపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ(Telangana) వాళ్లు పార్టీ పెట్టగలుగుతారా.. పార్టీ నడపగలుగుతారా.. తెలంగాణ వాళ్లకు అంత సీను ఉందా అనే అవహేళన మాటలు ఎన్నో విన్నాము. ఇలాంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 14 సంవత్సరాలు పార్టీని నిలబెట్టి, రాష్ట్ర సాధన కోసం చావు అంచుల వరకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ అని కొనియాడారు. సమైక్య నాయకులు పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టడం కాదు అని అవహేళన చేశారని గుర్తుచేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి(Kirankumar Reddy) తెలంగాణ చీకటి మయమైతుందని చెప్పారు. ఆయనలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే లాగా ఈరోజు రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపారు మన కెసిఆర్ అని వివ‌రించారు. తెలంగాణ పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుని అమలు చేసేలా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్(KCR) అని కొనియాడారు. తండ్రి సమానులైన కేసీఆర్ ని రాజకీయం కోసం నానా మాటలు తిట్టి ఈరోజు రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల(YS Sharmila) అని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తామని చెప్తున్న కర్ణాటక మోడల్(Karnataka Model) ప్రజలకు అర్థమైందన్నారు. కర్ణాటకలో రైతులు రోడ్డు మీదకు వచ్చారు. మూడు గంటల కరెంటు ఇచ్చి రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ అని మండిప‌డ్డారు. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ మోడల్ తెలంగాణలో పనికిరాదని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తోక ముడ్చుకుందని అన్నారు. రైతులకు ఇస్తున్న రైతుబంధు దండగ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా అవహేళన చేసేలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కూడా అవహేళన చేసే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

తెలంగాణ అమరవీరులను అవహేళన చేసి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కించపరచేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. సీమాంధ్ర నాయకుల సూట్కేసులు మోయడానికి అలవాటు పడ్డ వెన్నెముక లేని నాయకులు తెలంగాణని సమైక్య పాలకుల పాదాల దగ్గర పెట్టుతారని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పాలిస్తున కర్ణాటక రాష్ట్రానికి బియ్యం కావాలని తెలంగాణ రాష్ట్రాన్ని అడుగుతున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ చేసింది ఏం లేదన్నారు. ఈరోజు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను మార్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీకి 50 పైన స్థానాల్లో అభ్యర్థులు లేని పరిస్థితి నెల‌కొంద‌ని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ.. హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని ధీమా వ్య‌క్తం చేశారు. వ్యవసాయం గురించి తెలవని రేవంత్ రెడ్డికి ఎంత హార్స్ పవర్ మోటర్ రైతులు ఉపయోగిస్తారో కూడా తెలియదన్నారు. 10 HP మోటర్ పెట్టి మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలు అని చెప్పే అవగాహన లేని అధ్యక్షుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి రైతులకు ఏం చెప్పాలని అనుకుంటున్నారని ప్ర‌శ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వైఎస్ఆర్ టిపి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. వైఎస్సార్టీపీ లో ఎదుర్కొన్న సూటిపోటి మాటలు అవహేళనలు బీఆర్ఎస్ పార్టీలో ఉండవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేసి మరోసారి పార్టీ విజయానికి తోడు పడదామ‌ని సూచించారు.

Updated On 13 Nov 2023 9:32 PM GMT
Yagnik

Yagnik

Next Story