తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్‌(CM KCR)పై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మంగ‌ళ‌వారం విలేక‌రుల స‌మావేశంలో షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు దిక్కులేదు కానీ.. దొర గారు పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలను కాపాడే పనిలో పడ్డాడని విమ‌ర్శించారు. ప్రైవేటీకరణ కాకుండా ఆపుతానంటున్నారు.. రాష్ట్రం సొమ్ముతో పెట్టుబడులు పెడతాడనంటున్నారు. అక్కడ ఉద్యోగులను ఆదుకుంటానంటున్నారు. మరి మన రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతేంది దొర? అంటూ ప్ర‌శ్నించారు. ఇక్కడ రోడ్డున పడ్డ వేలాది […]

తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్‌(CM KCR)పై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మంగ‌ళ‌వారం విలేక‌రుల స‌మావేశంలో షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు దిక్కులేదు కానీ.. దొర గారు పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలను కాపాడే పనిలో పడ్డాడని విమ‌ర్శించారు. ప్రైవేటీకరణ కాకుండా ఆపుతానంటున్నారు.. రాష్ట్రం సొమ్ముతో పెట్టుబడులు పెడతాడనంటున్నారు. అక్కడ ఉద్యోగులను ఆదుకుంటానంటున్నారు. మరి మన రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతేంది దొర? అంటూ ప్ర‌శ్నించారు. ఇక్కడ రోడ్డున పడ్డ వేలాది కార్మికుల కుటుంబాలు నీ కండ్లకు కనపడడం లేదా? గెలిస్తే 100రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ(Nizam Sugar Factory) తెరిపిస్తానని మోసం చేశార‌ని అన్నారు. అజంజాహీ మిల్స్, పేపర్ ఫ్యాక్టరీలకు పునర్వైభవం తీసుకొస్తానని దగా చేశార‌ని మండిప‌డ్డారు. ఎన్నడో మూతపడిన ఐడీపీఎల్‌(IDPL), హెచ్ఎంటీ(HMT), హెచ్‌సీఎల్‌(HCL), ఆల్విన్, ప్రాగటూల్స్ లాంటి కంపెనీలను తెరిపించడం చేతకాలేదా ప్ర‌శ్నించారు. ముందుగా ఇక్కడ మూత పడిన పరిశ్రమలను తెరిపించాల‌ని డిమాండ్ చేశారు. రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకోవాల‌ని కోరారు. దమ్ముంటే కేంద్రం మెడలు వంచి బయ్యారం స్టీల్ ప్లాంట్(Bayyaram Steel Plant) ను ఏర్పాటు చేయించాల‌ని.. కేంద్రం ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తదన్న మీ హామీని నిలబెట్టుకోవాల‌ని షర్మిల అన్నారు.

Updated On 11 April 2023 11:42 AM GMT
Yagnik

Yagnik

Next Story