రేపు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి.

రేపు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈ సందర్భంగా 8వ తేదీ ఉదయం కాంగ్రెస్ నాయ‌కులు 10:30 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించ‌నున్న‌ట్లు ఎమ్మెల్సీ, టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేర‌కు 8న చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. ఉదయం 10:45 గంటలకు ప్రజా భవన్ లో వైస్సార్ ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. 11:15 గంటలకు గాంధీ భవన్ లో వైఎస్సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించాలని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

Eha Tv

Eha Tv

Next Story