చిత్తుకాగితాలు ఏరుకుని పొట్టపోసుకునే ఓ మహిళ ఇద్దరు కామాంధుల కర్కశానాకి బలయ్యింది. ఇద్దరు యువకులు ఆమెపై పాశవికంగా అత్యాచారం చేశారు. అధిక రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కూకట్‌పల్లి(Kukatpally) పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

చిత్తుకాగితాలు ఏరుకుని పొట్టపోసుకునే ఓ మహిళ ఇద్దరు కామాంధుల కర్కశానాకి బలయ్యింది. ఇద్దరు యువకులు ఆమెపై పాశవికంగా అత్యాచారం చేశారు. అధిక రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కూకట్‌పల్లి(Kukatpally) పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్‌లోని(Hyderabad) మూసాపేట వై జంక్షన్‌ సమీపంలో ఉన్న విష్ణుప్రియ లాడ్జి పక్కనున్న భవనంలో వ్యాపార సముదాయాలున్నాయి. ఆదివారం ఉదయం భవనం సెల్లార్‌లోని ఒక షట్టర్‌ ముందు గుర్తు తెలియని 45 ఏళ్ల మహిళ మృతదేహాన్ని స్థానికులు చూశారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూస్తే మృతురాలి ఒంటిపై దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అధిక రక్తస్రావమైనట్టు గమనించారు. మృతదేహం పక్కన ఉన్న ఓ సంచిలో ఓ చీటిపై ఓ పేరు రాసి ఉంది. బహుశా ఆ పేరు ఆమెదే కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తే పాతికేళ్ల వయసున్న ఇద్దరు యువకులు ఘటన జరిగిన భవనం పక్కనే ఉన్న గల్లీలో ఆమెతో మాట్లాడటం కనిపించింది. కొన్ని నిమిషాల పాటు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమెను బలవంతంగా సెల్లార్‌లోని షట్టర్‌ దగ్గరకు లాక్కెళ్లారు. కాసేపటికి ఆ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై కూకట్‌పల్లి వైపు వెళ్లారు. మహిళ మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Updated On 22 April 2024 1:14 AM GMT
Ehatv

Ehatv

Next Story