ఎల్బీనగర్‌లో(LB Nagar) అప్పుకు(Debt) సంబంధించిన గొడవ కారణంగా ఓ మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది

ఎల్బీనగర్‌లో(LB Nagar) అప్పుకు(Debt) సంబంధించిన గొడవ కారణంగా ఓ మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సమ్మ(Narsamma) అనే మహిళ సరోజిని వద్ద రూ.20 వేలు అప్పుగా తీసుకుంది. అప్పు తిరిగి ఇవ్వాలంటూ గొడవ మొదలైంది. మాటా మాటా అనుకున్న వారి మధ్య వివాదాలు చెలరేగడంతో తీవ్ర ఘర్షణకు దారితీసింది. నర్సమ్మను సరోజిని సుత్తితో కొట్టింది. ఈ దెబ్బలకు నర్సమ్మ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.

సరోజినీ ఒకరోజు నర్సమ్మను అత్యవసరంగా డబ్బులు అవసరమని చెప్పింది. నర్సమ్మ తన వద్ద ఉన్న 20000 ను సరోజినీకి అప్పుగా ఇచ్చింది. కొద్దిరోజులకు 20 వేల రూపాయలను తిరిగి ఇవ్వమని నర్సమ్మ అడిగింది. కానీ ఆమె పట్టించుకోలేదు. కోపంతో నర్సమ్మ తన డబ్బులు తనకి ఇవ్వమని సరోజినినీ గట్టిగా అడిగింది. ఇద్దరు మధ్య గొడవ కాస్తా దాడులకు దారి తీసింది. సరోజినీ సుత్తితో ఒక్క సారిగా నర్సమ్మ ముఖంపై దాడి చేయగా.. నర్సమ్మకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితురాలు సరోజినిని అదుపులోకి తీసుకున్నారు.

Eha Tv

Eha Tv

Next Story