ఓ మహిళకు పెళ్లయి రెండు ఏళ్లు గడుస్తున్నా పిల్లలు(children) పుట్టలేదు.

ఓ మహిళకు పెళ్లయి రెండు ఏళ్లు గడుస్తున్నా పిల్లలు(children) పుట్టలేదు. లోపం ఎవరిలో ఉందో తెలుసుకోకుండానే అత్తింటివారు వేధింపులు మొదలుపెట్టారు. ఇక తన భర్త చాలా అడ్వాన్స్ అయిపోయాడు. నీకు పిల్లలు పుట్టే ప్రసక్తే లేదు.. నీ చెల్లిని(sister) ఇచ్చి పెళ్లి చేయాలని వేధించాడు. దీంతో భార్య అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏం జరిగిందంటే..

భద్రాద్రి(Bhadradi) కొత్తగూడెం(kotha gudem) జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడికి చెందిన భుక్యా రేణుకను టేకులపల్లి మండలం దంతాల తండాకు చెందిన భుక్యా బాబులాల్‌కు ఇచ్చి 2022లో తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి అయ్యి రెండు సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టలేదు. దీంతో అత్తమామలు వేధింపులు ప్రారంభించారు. నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు.. నువ్వొక గొడ్రాలి(Infertile) అంటూ మానసికంగా హింసించడం మొదలు పెట్టారు. తమ కొడుకుకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. నువ్వు విడాకులు ఇస్తే తమ కొడుక్కి మరో పెళ్లి చేస్తామని వేధించసాగారు. భర్త బాబులాల్‌ కూడా తల్లిదండ్రుల మాటకే విలువ ఇచ్చాడు. విడాకులు అయినా ఇవ్వాలని లేదా నీ చెల్లితో పెళ్లి చేయించాలని షరతు విధించాడు. లేదంటే మరోకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో రేణుక మనస్తాపం చెంది పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తింటివారి వేధింపులు, సూటిపోటి మాటలతో మరింత కలతచెందింది. గత నెల 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు(suicide) ప్రయత్నించింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వారంరోజుల పాటు చికిత్స పొంది రేణుక మృతి చెందింది. ఈ సమయంలో అత్తింటివారు కనీసం చూసేందుకు కూడా రాలేదు. తన చావుకు కారణం భర్త బాబూలాల్, అత్తింటివారేనని పోలీసులకు రేణుక వాంగ్మూలం ఇచ్చింది. రేణుక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story