నేడు మందుబాబులకు ఆ ప్రాంతాల్లో బ్లాక్ డే అనే చెప్పొచ్చు

నేడు మందుబాబులకు ఆ ప్రాంతాల్లో బ్లాక్ డే అనే చెప్పొచ్చు. శ్రీరామనవమిని పురస్కరించుకుని బుధవారం రాచకొండ పోలీసు కమిషనరేట్ ​పరిధిలోని మద్యం షాపులు మూసేశారు. వైన్ షాపులు మూసి వేయాలని.. రాచకొండ కమిషనర్​ తరుణ్​జోషి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. ఊరేగింపు సంద‌ర్భంగా ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేయించారు. కల్లు దుకాణాలు, వైన్స్​, బార్​అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, క్లబ్స్​ బుధ‌వారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మూసి వేయనున్నారు.

శ్రీరామనవమి పురస్కరించుకొని హైదరాబాద్‌లో అంగరంగా వైభవంగా శోభయాత్ర సాగుతుంది. శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్ననారు. జీహెచ్​ఎంసీ(GHMC), రెవెన్యూ, జలమండలి, విద్యుత్‌ తదితర శాఖల అధికారులతో హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Updated On 16 April 2024 10:42 PM GMT
Yagnik

Yagnik

Next Story